శాంసన్ వర్సెస్ వైభవ్.. ప్రపంచకప్లో ఓపెనర్గా ఎవరుండాలంటే? రహానే క్లారిటీ
- వైభవ్ కంటే శాంసన్కే ఓపెనర్గా అవకాశం ఇవ్వాలన్న రహానే
- ప్రపంచకప్లో టాప్-3నే కొనసాగించాలని సూచన
- శాంసన్, అభిషేక్, ఇషాన్ టాప్-3లో ఉండాలన్న రహానే
- వైభవ్కు భవిష్యత్తులో అవకాశాలు వస్తాయని అభిప్రాయం
- ఆఫ్ఘనిస్థాన్ సిరీస్కు శాంసన్ ఎంపికపై రహానే హర్షం
టీ20ల్లో భారత్ ఓపెనర్ల విషయంలో తరచూ మార్పులు చేస్తోంది. శుభ్మన్ గిల్, సంజూ శాంసన్ మధ్య పోటీ నెలకొంది. అభిషేక్ శర్మ ఇప్పటికే తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. తర్వాత ఇషాన్ కిషన్ కూడా ఓపెనర్గా తన వాదన వినిపించాడు. అయితే అతడిని మూడో స్థానానికి పంపించారు. తాజాగా వైభవ్ సూర్యవంశీకి అవకాశం రావడంతో శాంసన్ మరోసారి జట్టులో చోటు కోల్పోయాడు.
ఇంగ్లాండ్తో అరంగేట్ర సిరీస్లో వైభవ్ 14, 13, 15 పరుగులు చేశాడు. తర్వాత జింబాబ్వేతో సిరీస్లో మాత్రం అదరగొట్టాడు. మూడు మ్యాచ్ల్లో 151 పరుగులు చేశాడు. చివరి మ్యాచ్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. సిరీస్ ఉత్తమ ఆటగాడి అవార్డును కూడా అందుకున్నాడు.
ఇలాంటి సమయంలో భారత మాజీ బ్యాటర్ అజింక్య రహానే కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ కంటే సంజు శాంసన్కే మరో అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. వైభవ్కు భవిష్యత్తులో చాలా అవకాశాలు వస్తాయని చెప్పాడు.
ప్రపంచకప్లో రాణించిన టాప్-3 బ్యాటర్లతోనే భారత్ ముందుకెళ్లాలని రహానే సూచించాడు. శాంసన్, అభిషేక్, ఇషాన్ కిషన్ టాప్-3లో ఉండాలని అన్నాడు. రెండు మూడు మ్యాచుల్లో విఫలమైనంత మాత్రాన శాంసన్ను పక్కన పెట్టడం సరికాదని చెప్పాడు.
ఆఫ్ఘనిస్థాన్ సిరీస్కు శాంసన్ను తిరిగి జట్టులోకి తీసుకోవడంపై రహానే సంతోషం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్లో శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన విషయాన్ని గుర్తు చేశాడు. శాంసన్ మ్యాచ్ విన్నర్ అని పేర్కొన్నాడు. అతడి రాకతో జట్టు మరింత బలపడుతుందని చెప్పాడు.
ఇంగ్లాండ్తో అరంగేట్ర సిరీస్లో వైభవ్ 14, 13, 15 పరుగులు చేశాడు. తర్వాత జింబాబ్వేతో సిరీస్లో మాత్రం అదరగొట్టాడు. మూడు మ్యాచ్ల్లో 151 పరుగులు చేశాడు. చివరి మ్యాచ్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. సిరీస్ ఉత్తమ ఆటగాడి అవార్డును కూడా అందుకున్నాడు.
ఇలాంటి సమయంలో భారత మాజీ బ్యాటర్ అజింక్య రహానే కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ కంటే సంజు శాంసన్కే మరో అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. వైభవ్కు భవిష్యత్తులో చాలా అవకాశాలు వస్తాయని చెప్పాడు.
ప్రపంచకప్లో రాణించిన టాప్-3 బ్యాటర్లతోనే భారత్ ముందుకెళ్లాలని రహానే సూచించాడు. శాంసన్, అభిషేక్, ఇషాన్ కిషన్ టాప్-3లో ఉండాలని అన్నాడు. రెండు మూడు మ్యాచుల్లో విఫలమైనంత మాత్రాన శాంసన్ను పక్కన పెట్టడం సరికాదని చెప్పాడు.
ఆఫ్ఘనిస్థాన్ సిరీస్కు శాంసన్ను తిరిగి జట్టులోకి తీసుకోవడంపై రహానే సంతోషం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్లో శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన విషయాన్ని గుర్తు చేశాడు. శాంసన్ మ్యాచ్ విన్నర్ అని పేర్కొన్నాడు. అతడి రాకతో జట్టు మరింత బలపడుతుందని చెప్పాడు.