టీమిండియాలో గాయాల బెడద.. కీలక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానించిన బీసీసీఐ
- స్పోర్ట్స్ సైన్స్ హెడ్ పోస్టుకు మళ్లీ దరఖాస్తులు ఆహ్వానించిన బీసీసీఐ
- బెంగళూరు సీవోఈలో కీలక బాధ్యతలు
- 2025 మార్చి నుంచి ఖాళీగా ఉన్న పోస్టు
- నితిన్ పటేల్ తర్వాత భర్తీ కాని స్థానం
- ఆటగాళ్ల గాయాలు, ఫిట్నెస్పై పర్యవేక్షణ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరో కీలక పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లో ‘హెడ్-స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్’ పదవికి మళ్లీ దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టును గతేడాది సెప్టెంబర్లోనూ భర్తీ చేసేందుకు ప్రయత్నించినా.. సరైన అభ్యర్థి దొరకకపోవడంతో ప్రక్రియ పూర్తికాలేదు.
ఈ పదవి 2025 మార్చి తర్వాత ఖాళీగా ఉంది. దాదాపు మూడేళ్లు సీవోఈలో సేవలందించిన మాజీ టీమిండియా ఫిజియో నితిన్ పటేల్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఈ ఖాళీ ఏర్పడింది. 2023 వన్డే ప్రపంచకప్ ముందు జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీల రికవరీలో పటేల్ కీలక పాత్ర పోషించారు.
కొత్తగా ఎంపికయ్యే వ్యక్తి బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ విభాగానికి వ్యూహాత్మక, నిర్వహణపరమైన నాయకత్వం వహించాలి. జాతీయ జట్టు ఫిజియోలు, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ నిపుణులతో పాటు సీవోఈలోని వైద్య సిబ్బందిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆటగాళ్ల గాయాల నివారణ, చికిత్స, పునరావాసం, ఫిట్నెస్, శారీరక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
కొత్త వైద్య విధానాలు, పరిశోధనలు, సాంకేతికతను ఉపయోగించడం కూడా ఈ పోస్టులో కీలక బాధ్యతలుగా బీసీసీఐ పేర్కొంది. ఆటగాళ్ల ఆరోగ్యం, దీర్ఘకాలిక ఫిట్నెస్, గాయాల ముప్పు తగ్గించడం వంటి అంశాలపై వ్యూహాలను రూపొందించాల్సి ఉంటుంది.
ఈ పోస్టుకు స్పోర్ట్స్ సైన్స్ లేదా సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ తప్పనిసరి. డాక్టరేట్ ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తారు. ప్రొఫెషనల్ లేదా ఒలింపిక్ క్రీడల్లో బృందాలకు నాయకత్వం వహించిన కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థి వయసు 60 ఏళ్లలోపు ఉండాలి.
ఎంపికైన వ్యక్తి సీవోఈలో హెడ్ ఆఫ్ క్రికెట్గా ఉన్న మాజీ భారత బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 30 సాయంత్రం 5 గంటల్లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థులను వ్యక్తిగత ఇంటర్వ్యూకు పిలుస్తారు.
ఈ పోస్టు భర్తీ విషయంలో తొందరపడబోమని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇటీవలే చెప్పారు. సీవోఈలో ప్రస్తుతం సుమారు 16 మంది ఫిట్నెస్, రిహాబిలిటేషన్ సేవలు అందిస్తున్నారని.. అయితే వారందరినీ పర్యవేక్షించేందుకు సరైన నిపుణుడు అవసరమని తెలిపారు. అలాంటి నిపుణులు భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ పదవి 2025 మార్చి తర్వాత ఖాళీగా ఉంది. దాదాపు మూడేళ్లు సీవోఈలో సేవలందించిన మాజీ టీమిండియా ఫిజియో నితిన్ పటేల్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఈ ఖాళీ ఏర్పడింది. 2023 వన్డే ప్రపంచకప్ ముందు జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీల రికవరీలో పటేల్ కీలక పాత్ర పోషించారు.
కొత్తగా ఎంపికయ్యే వ్యక్తి బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ విభాగానికి వ్యూహాత్మక, నిర్వహణపరమైన నాయకత్వం వహించాలి. జాతీయ జట్టు ఫిజియోలు, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ నిపుణులతో పాటు సీవోఈలోని వైద్య సిబ్బందిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆటగాళ్ల గాయాల నివారణ, చికిత్స, పునరావాసం, ఫిట్నెస్, శారీరక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
కొత్త వైద్య విధానాలు, పరిశోధనలు, సాంకేతికతను ఉపయోగించడం కూడా ఈ పోస్టులో కీలక బాధ్యతలుగా బీసీసీఐ పేర్కొంది. ఆటగాళ్ల ఆరోగ్యం, దీర్ఘకాలిక ఫిట్నెస్, గాయాల ముప్పు తగ్గించడం వంటి అంశాలపై వ్యూహాలను రూపొందించాల్సి ఉంటుంది.
ఈ పోస్టుకు స్పోర్ట్స్ సైన్స్ లేదా సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ తప్పనిసరి. డాక్టరేట్ ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తారు. ప్రొఫెషనల్ లేదా ఒలింపిక్ క్రీడల్లో బృందాలకు నాయకత్వం వహించిన కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థి వయసు 60 ఏళ్లలోపు ఉండాలి.
ఎంపికైన వ్యక్తి సీవోఈలో హెడ్ ఆఫ్ క్రికెట్గా ఉన్న మాజీ భారత బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 30 సాయంత్రం 5 గంటల్లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థులను వ్యక్తిగత ఇంటర్వ్యూకు పిలుస్తారు.
ఈ పోస్టు భర్తీ విషయంలో తొందరపడబోమని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇటీవలే చెప్పారు. సీవోఈలో ప్రస్తుతం సుమారు 16 మంది ఫిట్నెస్, రిహాబిలిటేషన్ సేవలు అందిస్తున్నారని.. అయితే వారందరినీ పర్యవేక్షించేందుకు సరైన నిపుణుడు అవసరమని తెలిపారు. అలాంటి నిపుణులు భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.