రూ.1 లక్ష పెట్టుబడికి రూ.3.28 లక్షలు.. గోల్డ్‌ బాండ్‌ ఇన్వెస్టర్లకు భారీ లాభం!

Sovereign Gold Bond investment of 1 lakh turns into 3-28 lakhs for investors
  • ఎస్‌జీబీ 2021-22 సిరీస్‌ VI ధర రూ.15,334
  • సెప్టెంబర్‌ 7 నుంచి ముందస్తు రిడెంప్షన్‌
  • జారీ ధర రూ.4,682
  • దాదాపు 228 శాతం మూలధన రాబడి
  • రూ.3.28 లక్షలకు పెరిగిన రూ.1 లక్ష పెట్టుబడి
సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ (ఎస్‌జీబీ)లో పెట్టుబడి పెట్టిన వారికి భారీ లాభం వచ్చింది. 2021-22 సిరీస్‌ VI బాండ్ల ముందస్తు రిడెంప్షన్‌ ధరను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రూ.15,334గా నిర్ణయించింది. ఈ బాండ్లను 2026 సెప్టెంబర్‌ 7 నుంచి ముందుగానే వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. 

2021 సెప్టెంబర్‌లో జారీ చేసిన ఈ ఎస్‌జీబీ సిరీస్‌ ఆన్‌లైన్‌ కొనుగోలుదారులకు గ్రాము రూ.4,682 ధరకు లభించింది. ప్రస్తుత రిడెంప్షన్‌ ధరతో పోలిస్తే గ్రాముకు రూ.10,652 లాభం వస్తుంది. అంటే దాదాపు 228 శాతం రాబడి. వడ్డీని ఇందులో లెక్కించలేదు. 

రూ.1 లక్ష పెడితే ఎంత?
2021లో ఈ సిరీస్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే.. బాండ్‌ విలువ ఇప్పుడు దాదాపు రూ.3.28 లక్షలకు చేరుతుంది. ఇది 228 శాతం మూలధన రాబడిని సూచిస్తుంది. దీనికి అదనంగా ఎస్‌జీబీపై ఏడాదికి 2.50 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. వడ్డీని ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. 

ఐదేళ్లు పూర్తైన తర్వాత వడ్డీ చెల్లించే తేదీన మాత్రమే ఎస్‌జీబీ ముందస్తు రిడెంప్షన్‌ చేయవచ్చు. రిడెంప్షన్‌ ధరను నిర్ణయించేందుకు ముందు మూడు పనిదినాల్లో 999 స్వచ్ఛత బంగారం ముగింపు ధరల సగటును తీసుకుంటారు. సెప్టెంబర్‌ 7న జరగనున్న రిడెంప్షన్‌కు సెప్టెంబర్‌ 2, 3, 4 ధరలను పరిగణనలోకి తీసుకున్నారు. 

అయితే ఆన్‌లైన్‌ కాకుండా ఇతర మార్గాల్లో కొనుగోలు చేసిన వారికి అప్పటి జారీ ధర గ్రాముకు రూ.4,732గా ఉంది. ఆన్‌లైన్‌ కొనుగోలుదారులకు రూ.50 తగ్గింపు లభించింది.
Advertisement
Sovereign Gold Bond
SGB Redemption Price
RBI Gold Bond Scheme
Gold Bond Investment Returns
SGB 2021 22 Series VI
Sovereign Gold Bond Profit

More Telugu News