విద్యాశాఖలో కీలక మార్పులు.. టీచర్ల సమస్యలపై సీఎం రేవంత్ హామీ
- పెండింగ్ టీచర్ల పదోన్నతులు పూర్తి చేశామన్న రేవంత్
- బదిలీలపై జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామన్న సీఎం
- రెండేళ్లలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ
- సాంకేతిక విద్యకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్న రేవంత్
- పాలిటెక్నిక్ విధానంలో మార్పులు లేవని స్పష్టీకరణ
విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులను పూర్తి చేశామని చెప్పారు. టీచర్ల బదిలీల విషయంలోనూ ప్రభుత్వం ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తోందన్నారు. కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు.
తల్లిదండ్రులతో సమానంగా పిల్లల భవిష్యత్తుకు పునాది వేసేది ఉపాధ్యాయులేనని రేవంత్రెడ్డి అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్ల సమయం ఇస్తే సమస్యలను పరిష్కరించి చూపిస్తానన్నారు.
తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని సీఎం చెప్పారు. సాంకేతిక విద్యకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని పేర్కొన్నారు. పాలిటెక్నిక్ విద్యావిధానంలో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు.
విద్యాశాఖ కమిషన్ ద్వారా అనేక సమస్యలను పరిష్కరిస్తున్నామని రేవంత్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీ సమస్యను పరిష్కరించామని చెప్పారు. ఇటీవల ఇందిరాపార్క్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేయడం తనకు చాలా బాధ కలిగించిందన్నారు.
కార్యక్రమానికి ముందు కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను సీఎం పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు.
తల్లిదండ్రులతో సమానంగా పిల్లల భవిష్యత్తుకు పునాది వేసేది ఉపాధ్యాయులేనని రేవంత్రెడ్డి అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్ల సమయం ఇస్తే సమస్యలను పరిష్కరించి చూపిస్తానన్నారు.
తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని సీఎం చెప్పారు. సాంకేతిక విద్యకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని పేర్కొన్నారు. పాలిటెక్నిక్ విద్యావిధానంలో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు.
విద్యాశాఖ కమిషన్ ద్వారా అనేక సమస్యలను పరిష్కరిస్తున్నామని రేవంత్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీ సమస్యను పరిష్కరించామని చెప్పారు. ఇటీవల ఇందిరాపార్క్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేయడం తనకు చాలా బాధ కలిగించిందన్నారు.
కార్యక్రమానికి ముందు కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను సీఎం పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు.