రాజమండ్రిలో సగం కాలుష్యానికి కారణం ఇదే: పవన్ కల్యాణ్
- పుష్కర కాలంగా పన్నులు ఎగవేస్తున్న ఆంధ్ర పేపర్ మిల్లు
- రాజమండ్రి కాలుష్యంలో సగం ఆ పరిశ్రమ వల్లేనన్న పవన్
- పద్ధతి మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
- కోర్టు కేసులను వేగవంతం చేయాలని న్యాయవాదులకు ఆదేశాలు
- స్వచ్ఛ గోదావరి లక్ష్యంగా ముందుకెళతామన్న ప్రభుత్వం
రాజమండ్రిలోని ఆంధ్ర పేపర్ లిమిటెడ్ (ఏపీఎల్) తీరుపై రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కర కాలంగా పన్నులు ఎగవేస్తూ, మరోవైపు గోదావరి నదిని తీవ్రంగా కలుషితం చేస్తూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆయన విరుచుకుపడ్డారు. రాజమండ్రిలో సగం కాలుష్యానికి ఈ కంపెనీయే కారణమని ఆరోపించారు. పద్ధతి మార్చుకోకపోతే పరిశ్రమ కార్యకలాపాలను నిలిపివేయడం దగ్గర నుంచి లైసెన్సు రద్దు వరకు ఎలాంటి కఠిన చర్యలకైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు కంపెనీకి షోకాజ్ నోటీసులు జారీ చేసి, తక్షణమే చర్యలు చేపట్టాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులను ఆదేశించారు.
పుష్కర కాలంగా పన్ను ఎగవేత
2016 నుంచి కాటేరు గ్రామ పంచాయతీకి గానీ, రాజమండ్రి నగరపాలక సంస్థకు గానీ ఆంధ్ర పేపర్ మిల్లు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించలేదని పవన్ కల్యాణ్ ఆరోపించారు. స్థానిక సంస్థలకు సుమారు రూ. 21.34 కోట్ల మేర పన్నులు బకాయిపడిందని ఆయన తెలిపారు. పన్ను చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేసిన ప్రతిసారీ, యాజమాన్యం కోర్టులను ఆశ్రయించి జాప్యం చేస్తోందని, బాధ్యత నుంచి తప్పించుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా సొంతంగా పన్ను మినహాయింపు ఇచ్చుకున్నారా? అని ఆయన నిలదీశారు.
గోదావరిని కమ్మేస్తున్న కాలుష్యం
అధికారిక గణాంకాల ప్రకారమే రాజమండ్రి నగరంలోని మొత్తం కాలుష్యంలో సగం ఆంధ్ర పేపర్ మిల్లు నుంచే వస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నగరం మొత్తం మీద రోజుకు 70 మిలియన్ లీటర్ల ద్రవ వ్యర్థాలు ఉత్పత్తి అయితే, ఒక్క ఆంధ్ర పేపర్ మిల్లు నుంచే 35 మిలియన్ లీటర్ల వ్యర్థాలు వెలువడుతున్నాయని వివరించారు. ఈ వ్యర్థ జలాల్లో ప్రమాదకర రసాయనాలు నిర్దేశిత పరిమితికి మించి ఉన్నాయని పరీక్షల్లో తేలిందన్నారు. లాగూన్ల వద్ద సేకరించిన నీటి నమూనాల్లో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) లీటరుకు 36 మిల్లీగ్రాములుగా ఉందని, ఇది ప్రమాణాల కన్నా 20 శాతం అధికమని తెలిపారు. అదేవిధంగా ఫాస్ఫేట్ 6 శాతం, సల్ఫైడ్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల కన్నా ఏకంగా 70 శాతం అధికంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు.
పర్యావరణం, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం
పరిశ్రమ విడుదల చేస్తున్న కాలుష్యం వల్ల గోదావరి నీటిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గి జలచరాల మనుగడకు ముప్పు వాటిల్లుతోందని, నది సహజ పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. దుర్వాసన, నీటి నాణ్యత క్షీణతతో ప్రజారోగ్యానికి హాని కలుగుతోందని, భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని అన్నారు. గతంలో తాను క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు భూగర్భ జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించినా, యాజమాన్యం పట్టించుకోలేదని గుర్తుచేశారు.
ఇక ఉపేక్షించేది లేదు..
నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున పరిశ్రమ కార్యకలాపాలను నిలిపివేయడం, జరిమానాలు విధించడం, కంపెనీని సీజ్ చేయడం, లైసెన్సును రద్దు చేయడం వంటి కఠిన చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. అయితే, పరిశ్రమలను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే సంకీర్ణ ప్రభుత్వం ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి, తప్పు సరిదిద్దుకునే అవకాశం ఇచ్చిందని తెలిపారు. గత మూడు నెలలుగా పీసీబీ అధికారులు సంస్థ ప్రతినిధులతో పలుమార్లు చర్చించినా స్పందన కరువైందని అన్నారు.
ఈ నేపథ్యంలో తక్షణమే సమన్లు జారీ చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి కేసుల విచారణను వేగవంతం చేసేలా చూడాలని అడ్వకేట్ జనరల్, అదనపు ఏజీ, ఇతర ప్రభుత్వ న్యాయవాదులకు సూచించారు. 'స్వచ్ఛ గోదావరి - పవిత్ర పుష్కరాలు' నినాదంతో గోదావరి పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పర్యావరణవేత్తలు, పౌర సమాజం మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రజల ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణకే తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
పుష్కర కాలంగా పన్ను ఎగవేత
2016 నుంచి కాటేరు గ్రామ పంచాయతీకి గానీ, రాజమండ్రి నగరపాలక సంస్థకు గానీ ఆంధ్ర పేపర్ మిల్లు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించలేదని పవన్ కల్యాణ్ ఆరోపించారు. స్థానిక సంస్థలకు సుమారు రూ. 21.34 కోట్ల మేర పన్నులు బకాయిపడిందని ఆయన తెలిపారు. పన్ను చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేసిన ప్రతిసారీ, యాజమాన్యం కోర్టులను ఆశ్రయించి జాప్యం చేస్తోందని, బాధ్యత నుంచి తప్పించుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా సొంతంగా పన్ను మినహాయింపు ఇచ్చుకున్నారా? అని ఆయన నిలదీశారు.
గోదావరిని కమ్మేస్తున్న కాలుష్యం
అధికారిక గణాంకాల ప్రకారమే రాజమండ్రి నగరంలోని మొత్తం కాలుష్యంలో సగం ఆంధ్ర పేపర్ మిల్లు నుంచే వస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నగరం మొత్తం మీద రోజుకు 70 మిలియన్ లీటర్ల ద్రవ వ్యర్థాలు ఉత్పత్తి అయితే, ఒక్క ఆంధ్ర పేపర్ మిల్లు నుంచే 35 మిలియన్ లీటర్ల వ్యర్థాలు వెలువడుతున్నాయని వివరించారు. ఈ వ్యర్థ జలాల్లో ప్రమాదకర రసాయనాలు నిర్దేశిత పరిమితికి మించి ఉన్నాయని పరీక్షల్లో తేలిందన్నారు. లాగూన్ల వద్ద సేకరించిన నీటి నమూనాల్లో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) లీటరుకు 36 మిల్లీగ్రాములుగా ఉందని, ఇది ప్రమాణాల కన్నా 20 శాతం అధికమని తెలిపారు. అదేవిధంగా ఫాస్ఫేట్ 6 శాతం, సల్ఫైడ్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల కన్నా ఏకంగా 70 శాతం అధికంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు.
పర్యావరణం, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం
పరిశ్రమ విడుదల చేస్తున్న కాలుష్యం వల్ల గోదావరి నీటిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గి జలచరాల మనుగడకు ముప్పు వాటిల్లుతోందని, నది సహజ పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. దుర్వాసన, నీటి నాణ్యత క్షీణతతో ప్రజారోగ్యానికి హాని కలుగుతోందని, భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని అన్నారు. గతంలో తాను క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు భూగర్భ జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించినా, యాజమాన్యం పట్టించుకోలేదని గుర్తుచేశారు.
ఇక ఉపేక్షించేది లేదు..
నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున పరిశ్రమ కార్యకలాపాలను నిలిపివేయడం, జరిమానాలు విధించడం, కంపెనీని సీజ్ చేయడం, లైసెన్సును రద్దు చేయడం వంటి కఠిన చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. అయితే, పరిశ్రమలను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే సంకీర్ణ ప్రభుత్వం ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి, తప్పు సరిదిద్దుకునే అవకాశం ఇచ్చిందని తెలిపారు. గత మూడు నెలలుగా పీసీబీ అధికారులు సంస్థ ప్రతినిధులతో పలుమార్లు చర్చించినా స్పందన కరువైందని అన్నారు.
ఈ నేపథ్యంలో తక్షణమే సమన్లు జారీ చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి కేసుల విచారణను వేగవంతం చేసేలా చూడాలని అడ్వకేట్ జనరల్, అదనపు ఏజీ, ఇతర ప్రభుత్వ న్యాయవాదులకు సూచించారు. 'స్వచ్ఛ గోదావరి - పవిత్ర పుష్కరాలు' నినాదంతో గోదావరి పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పర్యావరణవేత్తలు, పౌర సమాజం మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రజల ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణకే తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.