ప్రేమ కోసం కాదు.. పైసల కోసమే ఆ షో చేశా: రాఖీ సావంత్
- డబ్బు కోసమే 'రాఖీ కా స్వయంవర్' షో చేశానని వెల్లడి
- లోఖండ్వాలాలో ఇల్లు కొనడమే తన లక్ష్యమని స్పష్టీకరణ
- షోలో ప్రేమ, పెళ్లి అనేవి నిజం కాదని.. అంతా నటన అని వ్యాఖ్య
- కెనడా వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ జరిగినా.. పెళ్లి చేసుకోలేదని వెల్లడి
దాదాపు 15 ఏళ్ల క్రితం బుల్లితెరపై ప్రసారమైన తన రియాలిటీ షో 'రాఖీ కా స్వయంవర్' గురించి ఏళ్ల తర్వాత రాఖీ సావంత్ అసలు నిజాలు బయటపెట్టారు. ప్రేమ, పెళ్లి కోసం కాకుండా కేవలం డబ్బు సంపాదించి, ఇల్లు కొనాలనే ఉద్దేశంతోనే ఆ షో చేశానని, అదంతా ఒక పెద్ద నాటకమని కుండబద్దలు కొట్టారు. ఈ షో 2009లో ప్రసారమైన సంగతి తెలిసిందే.
ఇటీవల ఒక టాక్ షోలో పాల్గొన్న రాఖీ ఈ విషయాలు వెల్లడించారు. "స్వయంవరం సమయంలో నేను చాలా చిన్నదాన్ని. అప్పటికి నా ఫోకస్ అంతా బాలీవుడ్లో కెరీర్ నిలబెట్టుకోవడంపైనే ఉండేది. ప్రేమ, పెళ్లి లాంటి ఆలోచనలు లేవు. ముంబైలోని లోఖండ్వాలాలో ఒక ఇల్లు కొనాలన్నది నా కల. అప్పట్లో అద్దె ఇంట్లో ఉండేదాన్ని. అందుకే డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఆ షోకు ఒప్పుకున్నాను" అని ఆమె వివరించారు.
"ఆ షోలో పాల్గొన్న వాళ్లంతా నాలాగా కెరీర్ లో ఎదగాలనే తపన ఉన్నవాళ్లే. వాళ్లను ఎవరో ఎంపిక చేసి తీసుకొచ్చారు. అది పూర్తిగా ఫేక్ షో. డైరెక్టర్, ప్రొడ్యూసర్ నాకు స్క్రిప్ట్ చెబుతుంటే, నా ఆలోచన మాత్రం డబ్బుపైనే ఉండేది. వాళ్లు ఎంత డబ్బు ఇస్తారా అనేదే నా ధ్యాస. ప్రేమ నాటకం ఆడుతూ ఆ షోలో 16 మంది అబ్బాయిలతో డేటింగ్ చేశాను" అని రాఖీ అప్పటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు.
ఈ షో ఫైనల్లో రాఖీ సావంత్ కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఎలేశ్ పరుజన్వాలాను తన భాగస్వామిగా ఎంచుకున్నారు. షో ముగిసిన తర్వాత వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, ఆ తర్వాత వారు పెళ్లి చేసుకోకుండానే విడిపోయారు. ఇప్పుడు రాఖీ చేసిన వ్యాఖ్యలతో వారి బంధం ఎందుకు ముందుకు సాగలేదో స్పష్టమైంది.
'రాఖీ కా స్వయంవర్' తర్వాత 2010లో రాహుల్ మహాజన్తో 'రాహుల్ దుల్హనియా లే జాయేగా' అనే మరో స్వయంవరం షో ప్రసారమైంది. ఈ షోలో రాహుల్.. డింపీ గంగూలీని ఎంచుకుని పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే, వారి వివాహ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. కొన్ని నెలలకే వారు విడాకులు తీసుకుని విడిపోయారు. దీంతో ఇలాంటి రియాలిటీ షోల వాస్తవికతపై మరోసారి చర్చ మొదలైంది.
ఇటీవల ఒక టాక్ షోలో పాల్గొన్న రాఖీ ఈ విషయాలు వెల్లడించారు. "స్వయంవరం సమయంలో నేను చాలా చిన్నదాన్ని. అప్పటికి నా ఫోకస్ అంతా బాలీవుడ్లో కెరీర్ నిలబెట్టుకోవడంపైనే ఉండేది. ప్రేమ, పెళ్లి లాంటి ఆలోచనలు లేవు. ముంబైలోని లోఖండ్వాలాలో ఒక ఇల్లు కొనాలన్నది నా కల. అప్పట్లో అద్దె ఇంట్లో ఉండేదాన్ని. అందుకే డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఆ షోకు ఒప్పుకున్నాను" అని ఆమె వివరించారు.
"ఆ షోలో పాల్గొన్న వాళ్లంతా నాలాగా కెరీర్ లో ఎదగాలనే తపన ఉన్నవాళ్లే. వాళ్లను ఎవరో ఎంపిక చేసి తీసుకొచ్చారు. అది పూర్తిగా ఫేక్ షో. డైరెక్టర్, ప్రొడ్యూసర్ నాకు స్క్రిప్ట్ చెబుతుంటే, నా ఆలోచన మాత్రం డబ్బుపైనే ఉండేది. వాళ్లు ఎంత డబ్బు ఇస్తారా అనేదే నా ధ్యాస. ప్రేమ నాటకం ఆడుతూ ఆ షోలో 16 మంది అబ్బాయిలతో డేటింగ్ చేశాను" అని రాఖీ అప్పటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు.
ఈ షో ఫైనల్లో రాఖీ సావంత్ కెనడాకు చెందిన వ్యాపారవేత్త ఎలేశ్ పరుజన్వాలాను తన భాగస్వామిగా ఎంచుకున్నారు. షో ముగిసిన తర్వాత వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, ఆ తర్వాత వారు పెళ్లి చేసుకోకుండానే విడిపోయారు. ఇప్పుడు రాఖీ చేసిన వ్యాఖ్యలతో వారి బంధం ఎందుకు ముందుకు సాగలేదో స్పష్టమైంది.
'రాఖీ కా స్వయంవర్' తర్వాత 2010లో రాహుల్ మహాజన్తో 'రాహుల్ దుల్హనియా లే జాయేగా' అనే మరో స్వయంవరం షో ప్రసారమైంది. ఈ షోలో రాహుల్.. డింపీ గంగూలీని ఎంచుకుని పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే, వారి వివాహ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. కొన్ని నెలలకే వారు విడాకులు తీసుకుని విడిపోయారు. దీంతో ఇలాంటి రియాలిటీ షోల వాస్తవికతపై మరోసారి చర్చ మొదలైంది.