హరికృష్ణకు చంద్రబాబు, లోకేశ్ ఘన నివాళి
- మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ 70వ జయంతి
- సోషల్ మీడియా వేదికగా తమ జ్ఞాపకాలను పంచుకున్న చంద్రబాబు, లోకేశ్
- అందరి హృదయాలలో చిరస్థాయిగా ఉండిపోతారన్న చంద్రబాబు
- ప్రజానేతగా అందరి ప్రేమాభిమానాలు పొందారన్న నారా లోకేశ్
నటుడు, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ స్వర్గీయ నందమూరి హరికృష్ణ 70వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘనంగా నివాళులర్పించారు. సోషల్ మీడియా వేదికగా హరికృష్ణతో తమకున్న అనుబంధాన్ని, ఆయన జ్ఞాపకాలను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. "మా కుటుంబ సభ్యులు, స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి 70వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. సినీ రంగంలోనూ, రాజకీయాల్లోనూ తనదైన శైలిలో ప్రత్యేక ముద్ర వేసిన హరికృష్ణ గారు అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు" అని పేర్కొన్నారు. ఆయన స్మృతిలో నివాళులర్పిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
నారా లోకేశ్ సైతం హరికృష్ణను స్మరించుకుంటూ భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు. "టీడీపీ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు మా నందమూరి హరికృష్ణ మావయ్య జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నాను. చెదరని చిరునవ్వు, ఆత్మీయత ఆయన సొంతం. హరి మావయ్య నటుడిగా, ప్రజా నేతగా అందరి ప్రేమాభిమానాలను పొందారు. ఆయన భౌతికంగా మనకు దూరమైనా, తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు" అని లోకేశ్ తన నివాళిలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. "మా కుటుంబ సభ్యులు, స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి 70వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. సినీ రంగంలోనూ, రాజకీయాల్లోనూ తనదైన శైలిలో ప్రత్యేక ముద్ర వేసిన హరికృష్ణ గారు అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు" అని పేర్కొన్నారు. ఆయన స్మృతిలో నివాళులర్పిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
నారా లోకేశ్ సైతం హరికృష్ణను స్మరించుకుంటూ భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు. "టీడీపీ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు మా నందమూరి హరికృష్ణ మావయ్య జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నాను. చెదరని చిరునవ్వు, ఆత్మీయత ఆయన సొంతం. హరి మావయ్య నటుడిగా, ప్రజా నేతగా అందరి ప్రేమాభిమానాలను పొందారు. ఆయన భౌతికంగా మనకు దూరమైనా, తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు" అని లోకేశ్ తన నివాళిలో పేర్కొన్నారు.