డీవైఎఫ్ఐ చరిత్రలో తొలిసారి.. కేరళ అధ్యక్షురాలిగా మహిళ

Chintha Jerome becomes first woman president in DYFI Kerala history
  • డీవైఎఫ్ఐకి చింతా జెరోమ్ నియామకం
  • త్రిశూర్‌లో జరిగిన 16వ రాష్ట్ర మహాసభలో ఈ నిర్ణయం
  • ప్రధాన కార్యదర్శిగా ఎం. విజన్, కోశాధికారిగా ఆర్. రాహుల్ 
  • ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా మార్పులు
  • మాజీ మేయర్ ఆర్య రాజేంద్రన్‌కు రాష్ట్ర సెక్రటేరియట్‌లో చోటు
సీపీఎం అనుబంధ యువజన విభాగం ‘డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (డీవైఎఫ్ఐ) కేరళ విభాగం చరిత్రలో నూతన అధ్యాయం ఆవిష్కృతమైంది. సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలిగా తొలిసారి ఒక మహిళా నేత ఎన్నికయ్యారు. త్రిశూర్‌లో జరిగిన 16వ రాష్ట్ర మహాసభలో చింతా జెరోమ్‌ను ఈ కీలక బాధ్యతలకు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని డీవైఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు ఏ.ఏ. రహీం అధికారికంగా ప్రకటించారు.

నూతన కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కల్లియాస్సేరి ఎమ్మెల్యే, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి ఎం. విజిన్‌ను, కోశాధికారిగా ఆర్. రాహుల్‌ను నియమించారు. కొల్లాం జిల్లాకు చెందిన చింతా జెరోమ్.. ఎస్‌ఎఫ్‌ఐ ద్వారా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. కేరళ విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్ల సాహిత్యంలో డాక్టరేట్ పొందిన ఆమె, ప్రస్తుతం డీవైఎఫ్ఐ కేంద్ర కమిటీతో పాటు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. గతంలో ఆమె డాక్టరేట్ థీసిస్, కొన్ని వ్యాఖ్యలపై వివాదాలు తలెత్తినప్పటికీ, పార్టీలో ఆమె ఎదుగుదల నిరంతరాయంగా సాగింది.

మరోవైపు, తిరువనంతపురం మాజీ మేయర్ ఆర్య రాజేంద్రన్‌కు 25 మంది సభ్యులతో కూడిన రాష్ట్ర సెక్రటేరియట్‌లో చోటు దక్కింది. ఆమె భర్త, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కే. సచిన్ దేవ్‌కు నూతన ఉపాధ్యక్షులలో ఒకరిగా అవకాశం కల్పించారు.                                
Advertisement
Chintha Jerome
DYFI Kerala President
CPM Kerala
M Vijin
Kerala Youth Politics
Democratic Youth Federation of India

More Telugu News