అమెరికాకు సహకరిస్తే శత్రువులుగానే చూస్తాం: దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- అమెరికా ఆర్థిక యుద్ధంలో పాలుపంచుకోవద్దన్న ఇరాన్
- అమెరికా దిగ్బంధనంలో చేరొద్దని పొరుగు దేశాలకు హెచ్చరిక
- అలా చేస్తే హర్మూజ్ జలసంధిని మూసేస్తామన్న ఇరాన్
- అమెరికా చర్యలు విఫలమవుతాయని జోస్యం
తమపై అమెరికా సాగిస్తున్న ఆర్థిక యుద్ధంలో ఏ దేశమైనా పాలుపంచుకుంటే, ఆ దేశాన్ని కూడా తమ శత్రువుగానే పరిగణిస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. తమను ఒంటరిని చేసేందుకు అమెరికాతో కలిసే దేశాల ప్రయోజనాలపై దాడులు చేస్తామని, పొరుగు దేశాలు ఈ దిగ్బంధనంలో చేరితే హర్మూజ్ జలసంధి నుంచి ఒక్క చుక్క నూనె కూడా బయటకు వెళ్లకుండా అడ్డుకుంటామని స్పష్టం చేసింది.
ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మొహ్సెన్ రెజాయీ శనివారం ఓ ప్రభుత్వ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. "అమెరికాకు సహకరించే దేశాలతో తొలుత చర్చలు జరుపుతాం. ఈ వివాదానికి దూరంగా ఉండాలని కోరతాం. వారు మా మాట వినకపోతే, వారి ప్రయోజనాలపై దాడులు చేయడం తప్ప మాకు మరో మార్గం ఉండదు" అని ఆయన హెచ్చరించారు. ఏళ్ల తరబడిగా అమెరికా ఆంక్షలను ఎలా ఎదుర్కోవాలో, చమురు అమ్మకాలను ఎలా కొనసాగించాలో తమకు బాగా తెలుసని రెజాయీ ధీమా వ్యక్తం చేశారు.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్కు ఏ దేశమైనా ఆర్థికంగా జీవనాధారం కల్పిస్తే, వారిపై చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో కఠినమైన ఆర్థిక చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దీనిని ‘ఎకనామిక్ వార్ఫేర్’గా, ‘ఎకనామిక్ డీ-డే’గా అభివర్ణిస్తూ ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ట్రంప్ ప్రకటన నేపథ్యంలోనే ఇరాన్ నుంచి ఈ తీవ్ర స్పందన వచ్చింది.
ఈ పరిణామాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ కూడా స్పందించారు. ఇరాన్పై అమెరికా ప్రయోగిస్తున్న అన్ని చర్యల్లాగే ఈ ఆర్థిక ఆపరేషన్ కూడా విఫలమవడం ఖాయమని అన్నారు. "'చరిత్రలోనే అత్యంత కఠినమైన ఆంక్షలు', 'గరిష్ఠ ఒత్తిడి' వంటి గత ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇప్పుడు చేపట్టిన చర్య కూడా అదే విధంగా విఫలమవుతుంది" అని ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్'లో పేర్కొన్నారు.
కాగా, ఈ ప్రాంతంలో యుద్ధ వాతావరణాన్ని తగ్గించేందుకు జూన్లో అమెరికా-ఇరాన్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. అయితే, ఇరు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో తుది ఒప్పందంపై జరగాల్సిన చర్చల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది.
ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మొహ్సెన్ రెజాయీ శనివారం ఓ ప్రభుత్వ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. "అమెరికాకు సహకరించే దేశాలతో తొలుత చర్చలు జరుపుతాం. ఈ వివాదానికి దూరంగా ఉండాలని కోరతాం. వారు మా మాట వినకపోతే, వారి ప్రయోజనాలపై దాడులు చేయడం తప్ప మాకు మరో మార్గం ఉండదు" అని ఆయన హెచ్చరించారు. ఏళ్ల తరబడిగా అమెరికా ఆంక్షలను ఎలా ఎదుర్కోవాలో, చమురు అమ్మకాలను ఎలా కొనసాగించాలో తమకు బాగా తెలుసని రెజాయీ ధీమా వ్యక్తం చేశారు.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్కు ఏ దేశమైనా ఆర్థికంగా జీవనాధారం కల్పిస్తే, వారిపై చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో కఠినమైన ఆర్థిక చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దీనిని ‘ఎకనామిక్ వార్ఫేర్’గా, ‘ఎకనామిక్ డీ-డే’గా అభివర్ణిస్తూ ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ట్రంప్ ప్రకటన నేపథ్యంలోనే ఇరాన్ నుంచి ఈ తీవ్ర స్పందన వచ్చింది.
ఈ పరిణామాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ కూడా స్పందించారు. ఇరాన్పై అమెరికా ప్రయోగిస్తున్న అన్ని చర్యల్లాగే ఈ ఆర్థిక ఆపరేషన్ కూడా విఫలమవడం ఖాయమని అన్నారు. "'చరిత్రలోనే అత్యంత కఠినమైన ఆంక్షలు', 'గరిష్ఠ ఒత్తిడి' వంటి గత ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇప్పుడు చేపట్టిన చర్య కూడా అదే విధంగా విఫలమవుతుంది" అని ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్'లో పేర్కొన్నారు.
కాగా, ఈ ప్రాంతంలో యుద్ధ వాతావరణాన్ని తగ్గించేందుకు జూన్లో అమెరికా-ఇరాన్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. అయితే, ఇరు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో తుది ఒప్పందంపై జరగాల్సిన చర్చల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది.