మహిళలు ఎవరికీ బానిసలు కారు.. మనుస్మృతి భావజాలంపై రాహుల్ గాంధీ ఫైర్
- పుణేలో విద్యార్థులతో రాహుల్ గాంధీ.. మహిళలే దేశానికి అతిపెద్ద బలమన్న వ్యాఖ్య
- మనుస్మృతి భావజాలంపై తీవ్రంగా స్పందించిన రాహుల్
- వేదికపై గిరిజన విద్యార్థుల సమస్యలను ఏకరువు పెట్టిన విద్యార్థిని
- హాస్టళ్లలో పాముకాటు మరణాలు, బలవంతపు గర్భపరీక్షల ప్రస్తావన
- వారి నిరసనకు హాజరవుతానని హామీ ఇచ్చిన లోక్సభ ప్రతిపక్ష నేత
లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, పితృస్వామ్య భావజాలంపై, ముఖ్యంగా 'మనుస్మృతి' నిర్దేశించిన పరిమితులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశానికి అసలైన బలం, ఆస్తి 70 కోట్ల మంది మహిళలేనని ఆయన స్పష్టం చేశారు. శనివారం పుణెలో "ఛాత్రోం కీ గూంజ్" కార్యక్రమంలో భాగంగా 'పింజ్రా తోడా' (పంజరాన్ని బద్దలుకొట్టండి) అనే థీమ్తో విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. "దేశానికి అతిపెద్ద బలం ఏమిటని అడిగితే ఆర్థిక వ్యవస్థ, సైన్యం, జనాభా అంటూ రకరకాల సమాధానాలు చెబుతారు. కానీ నా దృష్టిలో భారతదేశానికి ఉన్న 70 కోట్ల మంది మహిళలే దేశానికి అతిపెద్ద శక్తి" అని అన్నారు. మహిళలు ఎవరికీ బానిసలు కారని ఉద్ఘాటించారు. బాల్యంలో ఉన్నప్పుడు తండ్రికి పనులు చేసిపెట్టడం కోసం, యవ్వనంలో భర్త కోసం, ఆ తర్వాత వృద్ధాప్యంలో కొడుకుల కోసం మహిళలు బతకాలనే మనుస్మృతి భావజాలం సిగ్గుచేటని విమర్శించారు. కుమార్తె, భార్య, తల్లి వంటి పాత్రలకే పరిమితం కాకుండా మహిళలు తమకంటూ ఒక సొంత గుర్తింపును ఏర్పరచుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నిషా అనే గిరిజన విద్యార్థిని ప్రసంగం అందరినీ కదిలించింది. గిరిజన విద్యార్థుల సమస్యలను ఆమె రాహుల్ గాంధీ దృష్టికి తీసుకొచ్చారు. పుణేలోని మంజరి ప్రాంతంలో తమ డిమాండ్ల సాధన కోసం గిరిజన విద్యార్థులు నిరాహార దీక్ష చేస్తున్నారని, వారి దుస్థితిని వివరిస్తూ ఒక వినతిపత్రాన్ని అందజేశారు. గిరిజన హాస్టళ్లలో కనీస వసతులు లేవని, 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేంద్రీకృత వంటశాలల నుంచి ఆహారం సరఫరా చేయడం వల్ల అది పాడైపోయి విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల గడ్చిరోలిలోని ఆశ్రమ పాఠశాలలో పాముకాటు కారణంగా ముగ్గురు విద్యార్థులు మరణించగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని నిషా తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, సెలవులకు ఇంటికి వెళ్లి తిరిగి వచ్చిన గిరిజన విద్యార్థినులకు హాస్టళ్లలో బలవంతంగా గర్భ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని చెప్పడంతో సభలో నిశ్శబ్దం అలుముకుంది. ఈ సమస్యలపై మంత్రులను కలిస్తే ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉందని చేతులెత్తేశారని, అలాంటప్పుడు వారికి పదవిలో ఉండే అర్హత లేదని ఆమె నిలదీశారు.
విద్యార్థిని ఆవేదనకు స్పందించిన రాహుల్ గాంధీ, వారి నిరసన శిబిరానికి తనను ఆహ్వానించమని కోరారు. "నన్ను నిరసన స్థలానికి పిలవండి, నేను తప్పకుండా వస్తాను. నా రాకతో ప్రభుత్వం, యంత్రాంగంపై ఒత్తిడి పెరుగుతుంది" అని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందురోజు ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగిన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేయడంతో ఈవెంట్ ప్రశాంతంగా ముగిసింది.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. "దేశానికి అతిపెద్ద బలం ఏమిటని అడిగితే ఆర్థిక వ్యవస్థ, సైన్యం, జనాభా అంటూ రకరకాల సమాధానాలు చెబుతారు. కానీ నా దృష్టిలో భారతదేశానికి ఉన్న 70 కోట్ల మంది మహిళలే దేశానికి అతిపెద్ద శక్తి" అని అన్నారు. మహిళలు ఎవరికీ బానిసలు కారని ఉద్ఘాటించారు. బాల్యంలో ఉన్నప్పుడు తండ్రికి పనులు చేసిపెట్టడం కోసం, యవ్వనంలో భర్త కోసం, ఆ తర్వాత వృద్ధాప్యంలో కొడుకుల కోసం మహిళలు బతకాలనే మనుస్మృతి భావజాలం సిగ్గుచేటని విమర్శించారు. కుమార్తె, భార్య, తల్లి వంటి పాత్రలకే పరిమితం కాకుండా మహిళలు తమకంటూ ఒక సొంత గుర్తింపును ఏర్పరచుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నిషా అనే గిరిజన విద్యార్థిని ప్రసంగం అందరినీ కదిలించింది. గిరిజన విద్యార్థుల సమస్యలను ఆమె రాహుల్ గాంధీ దృష్టికి తీసుకొచ్చారు. పుణేలోని మంజరి ప్రాంతంలో తమ డిమాండ్ల సాధన కోసం గిరిజన విద్యార్థులు నిరాహార దీక్ష చేస్తున్నారని, వారి దుస్థితిని వివరిస్తూ ఒక వినతిపత్రాన్ని అందజేశారు. గిరిజన హాస్టళ్లలో కనీస వసతులు లేవని, 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేంద్రీకృత వంటశాలల నుంచి ఆహారం సరఫరా చేయడం వల్ల అది పాడైపోయి విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల గడ్చిరోలిలోని ఆశ్రమ పాఠశాలలో పాముకాటు కారణంగా ముగ్గురు విద్యార్థులు మరణించగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని నిషా తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, సెలవులకు ఇంటికి వెళ్లి తిరిగి వచ్చిన గిరిజన విద్యార్థినులకు హాస్టళ్లలో బలవంతంగా గర్భ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని చెప్పడంతో సభలో నిశ్శబ్దం అలుముకుంది. ఈ సమస్యలపై మంత్రులను కలిస్తే ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉందని చేతులెత్తేశారని, అలాంటప్పుడు వారికి పదవిలో ఉండే అర్హత లేదని ఆమె నిలదీశారు.
విద్యార్థిని ఆవేదనకు స్పందించిన రాహుల్ గాంధీ, వారి నిరసన శిబిరానికి తనను ఆహ్వానించమని కోరారు. "నన్ను నిరసన స్థలానికి పిలవండి, నేను తప్పకుండా వస్తాను. నా రాకతో ప్రభుత్వం, యంత్రాంగంపై ఒత్తిడి పెరుగుతుంది" అని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందురోజు ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగిన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేయడంతో ఈవెంట్ ప్రశాంతంగా ముగిసింది.