పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నిరసన దీక్షలు
- తాడిపత్రికి వెళుతున్న పెద్దిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డిలను అడ్డుకున్న పోలీసులు
- ఇద్దరినీ అదుపులోకి తీసుకుని అనంతపురంకు తరలించిన పోలీసులు
డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిరసనల్లో పాల్గొనేందుకు అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళ్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డిలను పోలీసులు ముచ్చుకోట వద్ద అడ్డుకున్నారు.
తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి లేదని వీరికి పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో, పోలీసుల తీరును నిరసిస్తూ వైసీపీ నేతలు అక్కడే బైఠాయించారు. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డిలను అదుపులోకి తీసుకుని పోలీసులు... వారిని అక్కడి నుంచి అనంతపురంకు తరలించారు.
తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి లేదని వీరికి పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో, పోలీసుల తీరును నిరసిస్తూ వైసీపీ నేతలు అక్కడే బైఠాయించారు. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డిలను అదుపులోకి తీసుకుని పోలీసులు... వారిని అక్కడి నుంచి అనంతపురంకు తరలించారు.