ఏపీలో తక్కువ ధరకే బియ్యం.. అమ్మకాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల
- సామాన్యులకు ఊరటనిస్తూ ప్రభుత్వ బియ్యం అమ్మకాలు
- విజయవాడలో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్
- రైతు బజార్లు, మిల్లుల్లో కేజీ రూ. 50, రూ. 52కే బియ్యం
- త్వరలో కందిపప్పు, పామాయిల్ కూడా తక్కువ ధరకే
రాష్ట్రంలోని సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు, తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల వద్ద ప్రత్యేక కౌంటర్ల ద్వారా సబ్సిడీ బియ్యం విక్రయాలను ఆదివారం ప్రారంభించింది. విజయవాడలోని ఏపీఐఐసీ రైతు బజార్లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి, ప్రజలకు స్వయంగా బియ్యాన్ని అందజేశారు.
ఈ పథకం కింద బీపీటీ సూపర్ ఫైన్ రకం బియ్యాన్ని కిలో రూ. 52కు, బీపీటీ రా రైస్ను కిలో రూ. 50కే విక్రయిస్తున్నారు. ఆధార్ కార్డు చూపించి ఒక వ్యక్తి 10 కిలోల వరకు బియ్యం కొనుగోలు చేయవచ్చు. బహిరంగ మార్కెట్లో రూ. 60 నుంచి రూ. 65 వరకు పలుకుతున్న ఈ రకం బియ్యాన్ని ప్రభుత్వం తక్కువ ధరకే అందుబాటులోకి తేవడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. "ప్రజలకు కష్టం రాకముందే వారిని ఆదుకునే ప్రభుత్వం మాది. మార్కెట్లో బియ్యం ధరలను సమీక్షించి, సామాన్యుడిపై భారం పడకుండా తక్కువ ధరకే బియ్యం అందించాలని నిర్ణయించాం. మా విజ్ఞప్తికి రైస్ మిల్లర్లు సానుకూలంగా స్పందించి సహకరించడం అభినందనీయం" అని తెలిపారు. భవిష్యత్తులో కందిపప్పు, పామాయిల్ను కూడా తక్కువ ధరలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన రావు, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ నూపుర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, జనసేన నేత అమ్మిశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు.




ఈ పథకం కింద బీపీటీ సూపర్ ఫైన్ రకం బియ్యాన్ని కిలో రూ. 52కు, బీపీటీ రా రైస్ను కిలో రూ. 50కే విక్రయిస్తున్నారు. ఆధార్ కార్డు చూపించి ఒక వ్యక్తి 10 కిలోల వరకు బియ్యం కొనుగోలు చేయవచ్చు. బహిరంగ మార్కెట్లో రూ. 60 నుంచి రూ. 65 వరకు పలుకుతున్న ఈ రకం బియ్యాన్ని ప్రభుత్వం తక్కువ ధరకే అందుబాటులోకి తేవడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. "ప్రజలకు కష్టం రాకముందే వారిని ఆదుకునే ప్రభుత్వం మాది. మార్కెట్లో బియ్యం ధరలను సమీక్షించి, సామాన్యుడిపై భారం పడకుండా తక్కువ ధరకే బియ్యం అందించాలని నిర్ణయించాం. మా విజ్ఞప్తికి రైస్ మిల్లర్లు సానుకూలంగా స్పందించి సహకరించడం అభినందనీయం" అని తెలిపారు. భవిష్యత్తులో కందిపప్పు, పామాయిల్ను కూడా తక్కువ ధరలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన రావు, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ నూపుర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, జనసేన నేత అమ్మిశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు.



