రోజంతా హెచ్చుతగ్గులు... ఫ్లాట్గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
- సెన్సెక్స్కు 1.44 పాయింట్ల లాభం.. నిఫ్టీకి 5.75 పాయింట్ల నష్టం
- ఫైనాన్షియల్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి
- కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ సూచీలకు లాభాలు
- జూన్ త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్ల దృష్టి
- నిఫ్టీకి 24,200 నిరోధం.. 24,000 మద్దతు
భౌగోళిక ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల్లో హెచ్చుతగ్గులు, ఆసియా మార్కెట్ల బలహీన సంకేతాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్గా ముగిశాయి. సూచీలు రోజంతా భారీ హెచ్చుతగ్గులు నమోదు చేశాయి. ఆర్థిక రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి మార్కెట్పై ప్రభావం చూపింది.
సెన్సెక్స్ 1.44 పాయింట్లు పెరిగి 77,186.87 వద్ద ముగిసింది. నిఫ్టీ 5.75 పాయింట్ల స్వల్ప నష్టంతో 24,072.75 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 77,579.69 వద్ధ గరిష్ఠాన్ని, 77,086.42 దగ్గర కనిష్ఠ స్థాయిని తాకింది. నిఫ్టీ 24,186.50 గరిష్ఠం, 24,050 కనిష్ఠాన్ని నమోదు చేసింది.
రంగాల వారీగా చూస్తే కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కెమికల్స్, మీడియా, ఐటీ, ఆటో సూచీలు లాభాల్లో ముగిశాయి. మరోవైపు ఫైనాన్షియల్ సర్వీసెస్, రియాల్టీ, పీఎస్యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ-50 సూచీలో హెచ్సీఎల్ టెక్, ఇండిగో, విప్రో, మారుతీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. ఎటర్నల్, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫిన్సర్వ్, బీఈఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి.
జూన్ త్రైమాసిక ఫలితాలు, కంపెనీల యాజమాన్యాల వ్యాఖ్యలు, రుతుపవనాల పురోగతి, అంతర్జాతీయ పరిణామాలు, ద్రవ్యోల్బణ ధోరణులు మార్కెట్కు కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు తెలిపారు. సాంకేతికంగా నిఫ్టీకి 24,200 స్థాయి తక్షణ నిరోధకంగా ఉండగా, 24,000 స్థాయి కీలక మద్దతుగా ఉంటుందని అంచనా వేశారు.
సెన్సెక్స్ 1.44 పాయింట్లు పెరిగి 77,186.87 వద్ద ముగిసింది. నిఫ్టీ 5.75 పాయింట్ల స్వల్ప నష్టంతో 24,072.75 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 77,579.69 వద్ధ గరిష్ఠాన్ని, 77,086.42 దగ్గర కనిష్ఠ స్థాయిని తాకింది. నిఫ్టీ 24,186.50 గరిష్ఠం, 24,050 కనిష్ఠాన్ని నమోదు చేసింది.
రంగాల వారీగా చూస్తే కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కెమికల్స్, మీడియా, ఐటీ, ఆటో సూచీలు లాభాల్లో ముగిశాయి. మరోవైపు ఫైనాన్షియల్ సర్వీసెస్, రియాల్టీ, పీఎస్యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ-50 సూచీలో హెచ్సీఎల్ టెక్, ఇండిగో, విప్రో, మారుతీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. ఎటర్నల్, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫిన్సర్వ్, బీఈఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి.
జూన్ త్రైమాసిక ఫలితాలు, కంపెనీల యాజమాన్యాల వ్యాఖ్యలు, రుతుపవనాల పురోగతి, అంతర్జాతీయ పరిణామాలు, ద్రవ్యోల్బణ ధోరణులు మార్కెట్కు కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు తెలిపారు. సాంకేతికంగా నిఫ్టీకి 24,200 స్థాయి తక్షణ నిరోధకంగా ఉండగా, 24,000 స్థాయి కీలక మద్దతుగా ఉంటుందని అంచనా వేశారు.