శ్రీలంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్ సూర్యవంశీపై చర్యల గురించి బీసీసీఐ కార్యదర్శి ఏం చెప్పారంటే?
- శ్రీలంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగిన వైభవ్ సూర్యవంశీ
- యువ క్రికెటర్పై క్రమశిక్షణ చర్యలు ఉండవని చెప్పిన బీసీసీఐ కార్యదర్శి
- టోర్నీపై ఏకాగ్రత దెబ్బతినకూడదనే ఈ నిర్ణయమని వెల్లడి
దంబుల్లా వేదికగా జరిగిన ట్రై-నేషన్ సిరీస్ వన్డే మ్యాచ్లో భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్లు 265 పరుగుల వద్ద సమంగా నిలిచాయి. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీసింది. ఈ సూపర్ ఓవర్లో శ్రీలంక-ఏ జట్టు విజయం సాధించింది. అయితే, మ్యాచ్ ముగిసిన వెంటనే శ్రీలంక ఆటగాళ్లు, వైభవ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరగగా, శ్రీలంక వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లాతో పాటు ఇతర సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకుని వారిని విడదీశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటనపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ, "మా ఆటగాళ్లు టోర్నమెంట్పైనే దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాం. అనవసర విషయాల వల్ల వారి ఏకాగ్రత దెబ్బతినకూడదన్నదే మా ఉద్దేశం" అని స్పోర్ట్స్టార్కు వివరించారు. ఈ విషయంలో భారత జట్టు యాజమాన్యం కూడా వైభవ్కు పూర్తి మద్దతుగా నిలిచింది.