విశాఖ మెరైన్ ఇంజినీర్ మృతిపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...!
- అమెరికా దళాల దాడిలో విశాఖ మెరైన్ ఇంజినీర్ మృతి
- ఒమన్ తీరంలో జరిగిన విషాద ఘటన
- మృతుడు పట్నాల సురేష్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన
- బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ
"భారత నౌకపై అమెరికా దళాలు జరిపిన దాడిలో విశాఖపట్నానికి చెందిన మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేష్ గారు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. ఒమన్ తీరానికి సమీపంలో జరిగిన ఈ దురదృష్టకర ఘటనలో ఆయన మరణించారన్న వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురిచేసింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం చాలా బాధాకరం. సురేష్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ కష్టకాలంలో ప్రభుత్వం ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తుంది. వారిని ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇస్తున్నాను" అని పవన్ తన ప్రకటనలో తెలిపారు.