ఏపీ లిక్కర్ స్కామ్‌: రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డిలకు 14 రోజుల రిమాండ్

AP Liquor Scam 14 days remand for Raj KC Reddy and Vasudeva Reddy
  • ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక నిందితులు కాసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి అరెస్ట్
  • నిందితులను అరెస్ట్ చేసిన ఎన్‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)
  • 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన హైదరాబాద్ నాంపల్లి కోర్టు
  • చంచల్‌గూడ జైలుకు నిందితుల తరలింపు
ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న ఇద్దరిని నిన్న హైదరాబాద్‌లో అరెస్ట్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసీరెడ్డితో పాటు ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) మాజీ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టు అనంతరం వీరిని నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో వీరిద్దరినీ హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ అరెస్టులకు ముందు హైదరాబాద్‌లోని సుమారు 10 ప్రాంతాల్లో ఈడీ బృందాలు విస్తృతంగా సోదాలు నిర్వహించాయి.

గత ప్రభుత్వ పాలనలో (2019-2024) మద్యం విధానాలు, రవాణా కాంట్రాక్టుల్లో భారీ అవకతవకలు జరిగాయని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రాజ్ కేసీరెడ్డిని ఏ1గా, వాసుదేవ రెడ్డిని ఏ2గా అధికారులు పేర్కొన్నారు. గతంలో ఏపీ పోలీసులు ఏర్పాటు చేసిన సిట్ సైతం ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయగా, ప్రస్తుతం మనీలాండరింగ్ కోణంలో ఈడీ లోతైన విచారణ జరుపుతోంది.                                
Go Back to Shorts
Raj KC Reddy
Vasudeva Reddy
AP Liquor Scam
Enforcement Directorate
APSBCL
Money Laundering Case

More Telugu News