‘‘ఇక నా వల్ల కాదు..’’ ఐపీఎల్ మధ్యలోనే చెప్పేసిన హార్దిక్ పాండ్యా..?
- తీవ్ర మానసిక ఒత్తిడి, అలసటలో ఆల్రౌండర్
- సీజన్ మధ్యలోనే మేనేజ్మెంట్కు సమాచారం
- రెండేళ్లుగా అభిమానుల హేళనలతో విసుగు
- వేలంలోకి లేదా ట్రేడింగ్ ద్వారా మరో జట్టులోకి
ముంబై ఇండియన్స్ జట్టులో కొంతకాలంగా సాగుతున్న అంతర్గత విభేదాలు, కెప్టెన్సీ వివాదం ఎట్టకేలకు ముగింపునకు వచ్చినట్లు కనిపిస్తోంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి, శారీరక అలసటతో సతమతమవుతున్న ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ముంబై ఫ్రాంచైజీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్ మధ్యలోనే జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకొన్న వెంటనే హార్దిక్ తన నిర్ణయాన్ని యాజమాన్యానికి స్పష్టం చేశారని ఐపీఎల్ కు చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఇరు వర్గాల అంగీకారంతోనే ఈ విడిపోయే ప్రక్రియ జరగనున్నట్లు సమాచారం.
రోహిత్ శర్మ స్థానంలో వచ్చి
2024 సీజన్లో ముంబై ఇండియన్స్ అభిమానుల గుండెల్లో కొలువైన రోహిత్ శర్మను తప్పించి, హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడం పెద్ద వివాదానికి దారితీసింది. అప్పటి నుంచి మైదానంలోకి హార్దిక్ ఎప్పుడు వచ్చినా సొంత అభిమానులే అతనిపై పెద్ద ఎత్తున హేళనలు చేస్తూ వచ్చారు. ఈ పరిణామాలు హార్దిక్ను తీవ్రంగా కలచివేసినట్లు తెలుస్తోంది. ‘‘గత మూడేళ్లుగా హార్దిక్ ఎంతో ఒత్తిడిని భరిస్తున్నాడు. పైకి అంతా బాగానే ఉందని నవ్వినా.. లోపల మాత్రం తీవ్రంగా నలిగిపోయాడు. దీనికి తోడు వెన్నునొప్పి గాయం కూడా వేధించింది’’ అని సదరు అధికారి తెలిపారు.
సీనియర్ల సహకారం కరవు?
2021లో హార్దిక్ వదిలి వెళ్లిన ముంబై డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం, 2024లో అతను తిరిగి వచ్చేసరికి పూర్తిగా మారిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. జట్టులోని సీనియర్ ఆటగాళ్లు హార్దిక్ కెప్టెన్సీతో ఏకీభవించలేకపోయారు. భారత టీ20 జట్టుకు ఆడేటప్పుడు వంద శాతం నిబద్ధతను కోరుకునే కొందరు సీనియర్లు.. ఐపీఎల్లో హార్దిక్ నాయకత్వంలో ఆడేటప్పుడు మాత్రం అతనికి ఆ స్థాయిలో సహకరించలేదనే భావన బాగా గాయపరిచినట్లు తెలుస్తోంది. అందరూ వేర్వేరు దిశల్లో లాగుతున్నప్పుడు ఎంతటి ఆటగాడైనా మానసికంగా అలసిపోవడం సహజం.
తదుపరి అడుగు ఎటువైపు?
ముంబై ఇండియన్స్తో హార్దిక్ ప్రయాణం ముగిసిందనేది స్పష్టమౌతున్నా అతను నేరుగా మెగా వేలంలోకి వస్తాడా లేక ట్రేడింగ్ పద్ధతి ద్వారా మరేదైనా జట్టుతో ఒప్పందం కుదుర్చుకుంటాడా అనేది ఇంకా తేలలేదు. మానసిక ప్రశాంతత కోసం చూస్తున్న హార్దిక్ పట్ల చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
రోహిత్ శర్మ స్థానంలో వచ్చి
2024 సీజన్లో ముంబై ఇండియన్స్ అభిమానుల గుండెల్లో కొలువైన రోహిత్ శర్మను తప్పించి, హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడం పెద్ద వివాదానికి దారితీసింది. అప్పటి నుంచి మైదానంలోకి హార్దిక్ ఎప్పుడు వచ్చినా సొంత అభిమానులే అతనిపై పెద్ద ఎత్తున హేళనలు చేస్తూ వచ్చారు. ఈ పరిణామాలు హార్దిక్ను తీవ్రంగా కలచివేసినట్లు తెలుస్తోంది. ‘‘గత మూడేళ్లుగా హార్దిక్ ఎంతో ఒత్తిడిని భరిస్తున్నాడు. పైకి అంతా బాగానే ఉందని నవ్వినా.. లోపల మాత్రం తీవ్రంగా నలిగిపోయాడు. దీనికి తోడు వెన్నునొప్పి గాయం కూడా వేధించింది’’ అని సదరు అధికారి తెలిపారు.
సీనియర్ల సహకారం కరవు?
2021లో హార్దిక్ వదిలి వెళ్లిన ముంబై డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం, 2024లో అతను తిరిగి వచ్చేసరికి పూర్తిగా మారిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. జట్టులోని సీనియర్ ఆటగాళ్లు హార్దిక్ కెప్టెన్సీతో ఏకీభవించలేకపోయారు. భారత టీ20 జట్టుకు ఆడేటప్పుడు వంద శాతం నిబద్ధతను కోరుకునే కొందరు సీనియర్లు.. ఐపీఎల్లో హార్దిక్ నాయకత్వంలో ఆడేటప్పుడు మాత్రం అతనికి ఆ స్థాయిలో సహకరించలేదనే భావన బాగా గాయపరిచినట్లు తెలుస్తోంది. అందరూ వేర్వేరు దిశల్లో లాగుతున్నప్పుడు ఎంతటి ఆటగాడైనా మానసికంగా అలసిపోవడం సహజం.
తదుపరి అడుగు ఎటువైపు?
ముంబై ఇండియన్స్తో హార్దిక్ ప్రయాణం ముగిసిందనేది స్పష్టమౌతున్నా అతను నేరుగా మెగా వేలంలోకి వస్తాడా లేక ట్రేడింగ్ పద్ధతి ద్వారా మరేదైనా జట్టుతో ఒప్పందం కుదుర్చుకుంటాడా అనేది ఇంకా తేలలేదు. మానసిక ప్రశాంతత కోసం చూస్తున్న హార్దిక్ పట్ల చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.