సన్ రైజర్స్ కు ఎదురుదెబ్బ... గాయంతో సీజన్ మొత్తానికి దూరమైన కొత్త బౌలర్
- గాయం కారణంగా ఐపీఎల్ సీజన్కు దూరమైన డేవిడ్ పేన్
- రెండు మ్యాచ్లు ఆడిన పేన్.. 14 ఎకానమీతో కేవలం రెండు వికెట్లు
- ఫిట్నెస్ టెస్టులో పాసై జట్టులోకి రానున్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్
- పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతున్న సన్రైజర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ డేవిడ్ పేన్ చీలమండ గాయం కారణంగా మిగిలిన సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ 'ఎక్స్' వేదికగా అధికారికంగా ప్రకటించింది. అయితే, అతని స్థానంలో ఎవరినీ భర్తీ చేస్తున్నట్లు ఇంకా వెల్లడించలేదు.
సీజన్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా పేసర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయపడటంతో అతని స్థానంలో డేవిడ్ పేన్ను ఎస్ఆర్హెచ్ జట్టులోకి తీసుకుంది. పేన్ బిగ్ బాష్ లీగ్లో అద్భుతంగా రాణించినప్పటికీ, ఐపీఎల్లో మాత్రం ఆ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయాడు. ఎస్ఆర్హెచ్ తరఫున రెండు మ్యాచ్లు ఆడి, 14 ఎకానమీ రేటుతో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
ప్రస్తుతం ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో 5 మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్, రెండింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. సోమవారం జరిగిన మ్యాచ్లో టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్పై 57 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘనవిజయం సాధించింది. ఇక తమ తదుపరి మ్యాచ్లో సన్రైజర్స్ జట్టు శనివారం నాడు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది.
ఇదిలా ఉండగా, సన్రైజర్స్ జట్టుకు ఓ శుభవార్త అందింది. గాయంతో దూరమైన రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫిట్నెస్ టెస్టులో పాసయ్యాడు. త్వరలోనే అతను జట్టుతో కలవనున్నాడు. ఏప్రిల్ 25న జైపూర్లో రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్లో కమిన్స్ ఆడే అవకాశం ఉంది. ప్రస్తుతం కమిన్స్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.
సీజన్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా పేసర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయపడటంతో అతని స్థానంలో డేవిడ్ పేన్ను ఎస్ఆర్హెచ్ జట్టులోకి తీసుకుంది. పేన్ బిగ్ బాష్ లీగ్లో అద్భుతంగా రాణించినప్పటికీ, ఐపీఎల్లో మాత్రం ఆ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయాడు. ఎస్ఆర్హెచ్ తరఫున రెండు మ్యాచ్లు ఆడి, 14 ఎకానమీ రేటుతో కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
ప్రస్తుతం ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో 5 మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్, రెండింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. సోమవారం జరిగిన మ్యాచ్లో టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్పై 57 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఘనవిజయం సాధించింది. ఇక తమ తదుపరి మ్యాచ్లో సన్రైజర్స్ జట్టు శనివారం నాడు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది.
ఇదిలా ఉండగా, సన్రైజర్స్ జట్టుకు ఓ శుభవార్త అందింది. గాయంతో దూరమైన రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫిట్నెస్ టెస్టులో పాసయ్యాడు. త్వరలోనే అతను జట్టుతో కలవనున్నాడు. ఏప్రిల్ 25న జైపూర్లో రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్లో కమిన్స్ ఆడే అవకాశం ఉంది. ప్రస్తుతం కమిన్స్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.