ఐపీఎల్ పోరు: టాస్ గెలిచిన పంజాబ్... బ్యాటింగ్ చేయనున్న సన్రైజర్స్
ఐపీఎల్ లో నేడు శనివారం డబుల్ హెడర్ లో భాగంగా తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. చండీగఢ్లోని ముల్లన్పూర్ మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో కెప్టెన్ ఇషాన్ కిషన్ నేతృత్వంలోని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.
టాస్ గెలిచిన అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, "మేం ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది పగటిపూట మ్యాచ్ కాబట్టి, పిచ్ ఎలా స్పందిస్తుందో ఒక అంచనాకు రావాలనుకుంటున్నాం. గత కొన్ని మ్యాచ్లుగా ఇదే వ్యూహంతో విజయాలు సాధించాం. జట్టులోని యువ ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం. వారికి ఎక్కువగా చెబితే గందరగోళానికి గురవుతారు. అందుకే వారిని స్వేచ్ఛగా ఆడనిస్తున్నాం" అని వివరించాడు. బౌలింగ్ ఎంచుకోవడం వల్ల తుది జట్టులో ఒక మార్పు చేశామని, నేహల్ వధేరా స్థానంలో ప్రియాన్ష్ ఆర్య వస్తున్నాడని తెలిపాడు.
మరోవైపు, సన్రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ, "మేం కూడా బౌలింగ్ చేయాలనే అనుకున్నాం. కానీ పిచ్ గట్టిగా కనిపిస్తోంది. కాబట్టి మొదటి ఇన్నింగ్స్లో చక్కగా బ్యాటింగ్ చేయడంపై దృష్టి పెడతాం" అని అన్నాడు.
స్టార్ బౌలర్ పాట్ కమిన్స్ దూరం కావడంపై స్పందిస్తూ.. "పాట్ కమిన్స్ వంటి అనుభవజ్ఞుడైన బౌలర్ లేకపోవడం జట్టుకు పెద్ద నష్టమే. అయితే మా జట్టులో యువ బౌలర్లు ఉన్నారు, వారిపై నమ్మకముంది. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తే చాలు" అని ధీమా వ్యక్తం చేశాడు. జట్టులో రెండు మార్పులు చేశామని, లివింగ్స్టోన్ స్థానంలో సలీల్ అరోరా, జయదేవ్ ఉనద్కత్ స్థానంలో ప్రఫుల్ హింగే అరంగేట్రం చేస్తున్నాడని చెప్పాడు.
సన్రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్/వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ.
పంజాబ్ కింగ్స్: ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కూపర్ కానలీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్కుమార్ వైశాఖ్, అర్ష్దీప్ సింగ్, యజువేంద్ర చాహల్.
టాస్ గెలిచిన అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, "మేం ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది పగటిపూట మ్యాచ్ కాబట్టి, పిచ్ ఎలా స్పందిస్తుందో ఒక అంచనాకు రావాలనుకుంటున్నాం. గత కొన్ని మ్యాచ్లుగా ఇదే వ్యూహంతో విజయాలు సాధించాం. జట్టులోని యువ ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం. వారికి ఎక్కువగా చెబితే గందరగోళానికి గురవుతారు. అందుకే వారిని స్వేచ్ఛగా ఆడనిస్తున్నాం" అని వివరించాడు. బౌలింగ్ ఎంచుకోవడం వల్ల తుది జట్టులో ఒక మార్పు చేశామని, నేహల్ వధేరా స్థానంలో ప్రియాన్ష్ ఆర్య వస్తున్నాడని తెలిపాడు.
మరోవైపు, సన్రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ, "మేం కూడా బౌలింగ్ చేయాలనే అనుకున్నాం. కానీ పిచ్ గట్టిగా కనిపిస్తోంది. కాబట్టి మొదటి ఇన్నింగ్స్లో చక్కగా బ్యాటింగ్ చేయడంపై దృష్టి పెడతాం" అని అన్నాడు.
స్టార్ బౌలర్ పాట్ కమిన్స్ దూరం కావడంపై స్పందిస్తూ.. "పాట్ కమిన్స్ వంటి అనుభవజ్ఞుడైన బౌలర్ లేకపోవడం జట్టుకు పెద్ద నష్టమే. అయితే మా జట్టులో యువ బౌలర్లు ఉన్నారు, వారిపై నమ్మకముంది. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తే చాలు" అని ధీమా వ్యక్తం చేశాడు. జట్టులో రెండు మార్పులు చేశామని, లివింగ్స్టోన్ స్థానంలో సలీల్ అరోరా, జయదేవ్ ఉనద్కత్ స్థానంలో ప్రఫుల్ హింగే అరంగేట్రం చేస్తున్నాడని చెప్పాడు.
సన్రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్/వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగ.
పంజాబ్ కింగ్స్: ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కూపర్ కానలీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్కుమార్ వైశాఖ్, అర్ష్దీప్ సింగ్, యజువేంద్ర చాహల్.