Census 2027: జనగణనలో సహజీవన జంటల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

Live in Couples to be Recognized as Family in Census 2027
షార్ట్స్‌లో చూడండి
దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన-2027 ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక, విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. చాలాకాలంగా కలిసి జీవిస్తున్న (సహజీవనం) జంటలు తమ బంధాన్ని స్థిరమైనదిగా భావిస్తే, వారిని ‘కుటుంబం’గా గుర్తించనుంది. ఈ మేరకు రాబోయే జనగణన నిబంధనల్లో స్పష్టతనిచ్చింది.

జనగణనలో భాగంగా తొలిదశ అయిన ‘ఇళ్ల జాబితా నమోదు’, ‘గృహ గణన’ ప్రక్రియ 2026 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు జరగనుంది. ఈ దశలో అధికారులు ప్రజలను 33 ప్రశ్నలు అడిగి వివరాలు సేకరిస్తారు. ఇందులో భాగంగా, వివాహిత జంటల సంఖ్యను నమోదు చేసేటప్పుడు సహజీవన జంటలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

ఈ మొదటి దశలో ఇంటి యజమాని వివరాలు, ఇంటి నిర్మాణానికి వాడిన సామగ్రి, తాగునీటి సౌకర్యం, విద్యుత్, వంటగ్యాస్ కనెక్షన్ వంటి వివరాలు సేకరిస్తారు. వీటితో పాటు ఇంట్లో ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, వాహనాల వినియోగం, కుటుంబం ప్రధానంగా ఏ ఆహార ధాన్యాలు తింటుంది వంటి అంశాలపై కూడా ప్రశ్నలు ఉంటాయి.

ఈసారి జనగణన ప్రక్రియను డిజిటల్ పద్ధతిలోనూ నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు ‘సెల్ఫ్-ఎన్యూమరేషన్’ పోర్టల్‌ను అందుబాటులోకి తేనున్నారు. తొలి దశ పూర్తయ్యాక, 2027 ఫిబ్రవరిలో రెండో దశ అయిన ‘జనాభా గణన’ చేపడతారు. కులాల వారీగా గణన అంశంపై రెండో దశకు ముందే ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
Go Back to Shorts
Census 2027
Live-in couples
Central Government
India Census
Household listing
Digital Census
Self-enumeration
Population Census

More Telugu News