Chiranjeevi: ఎన్నో ఏళ్ల తర్వాత మిమ్మల్ని కలవడం థ్రిల్లింగ్ గా అనిపించింది: చిరంజీవి

Chiranjeevi Thrilled to Meet Madhuri Dixit After Years
షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిన్న నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో ఈ పురస్కారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాలీవుడ్ సీనియర్ నటి మాధురి దీక్షిత్ చేతుల మీదుగా ఆయన స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మాధురి దీక్షిత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ నేపథ్యంలో, చిరంజీవి ఇవాళ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా, మాధురి దీక్షిత్‌ను కలవడంపై ఆయన ప్రత్యేకంగా స్పందించారు. "ఎన్నో ఏళ్ల తర్వాత మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది మాధురి దీక్షిత్ గారూ. మీరు ఈ కార్యక్రమానికి విచ్చేసి, ఎన్టీఆర్ జాతీయ పురస్కార ప్రదానాన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు. కాలం ముందుకు సాగినా, తెరపై, బయట మీ అందం, ఆకర్షణ, ఆప్యాయత ఎప్పటికీ నిలిచి ఉంటాయి" అని చిరంజీవి తన పోస్టులో పేర్కొన్నారు.

ఈ క్రమంలో చాన్నాళ్ల కిందట తాను మాధురిని కలిసిన ఫొటోను కూడా చిరంజీవి పంచుకున్నారు. 


Go Back to Shorts
Chiranjeevi
NTR National Award
Madhuri Dixit
Telangana Government
Gaddar Film Awards
Ugadi
Revanth Reddy
Telugu Cinema
Bollywood

More Telugu News