Kerala Assembly Elections: నాలుగు రోజుల హైడ్రామాకు తెర.. కాంగ్రెస్ అభ్యర్థుల చివరి జాబితా విడుదల

Kerala Assembly Elections Congress Final List Released
షార్ట్స్‌లో చూడండి
కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో నాలుగు రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. ఏప్రిల్ 9న జరగనున్న పోలింగ్‌కు నామినేషన్ల గడువుకు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండగా, గురువారం రాత్రి 37 మందితో కూడిన తుది జాబితాను పార్టీ అధిష్ఠానం విడుదల చేసింది. దీంతో నాలుగు రోజుల పాటు సాగిన తీవ్ర చర్చలు, సంప్రదింపులు, హైడ్రామాకు ముగింపు పలికింది.

మొత్తం 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో కాంగ్రెస్ 92 స్థానాల్లో పోటీ చేయనుండగా, సీపీఎం నుంచి బయటకు వచ్చిన ముగ్గురు రెబల్ నేతలకు మద్దతు ఇస్తోంది. సీనియర్ నేత, కన్నూర్ ఎంపీ కె. సుధాకరన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో జాబితా విడుదల ఆలస్యమైంది. ఆయన పార్టీని వీడతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, సీనియర్ నేత ఏకే ఆంటోనీ చివరి నిమిషంలో రంగంలోకి దిగి ఆయనతో చర్చలు జరిపి బుజ్జగించడంతో సంక్షోభం సద్దుమణిగింది. తాను కాంగ్రెస్ ముందు చాలా చిన్నవాడినని, ఎన్నికల ప్రచారంలో ముందుంటానని సుధాకరన్ పేర్కొన్నారు.

విడుదలైన జాబితాలో సీనియర్లు, కొత్త ముఖాలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు ఎన్.శక్తన్, వి.శివకుమార్ వంటి సీనియర్లకు చోటు కల్పించారు. అదే సమయంలో, పార్టీ విధేయులైన ఈబీ కురియకోస్, పాలకులం మధు వంటి వారికి తొలిసారి అవకాశం ఇచ్చారు. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎల్డోస్ కున్నపల్లికి టికెట్ నిరాకరించడం అసంతృప్తికి దారితీసింది. తనను ఎందుకు పక్కనపెట్టారో అర్థం కావడం లేదని, మద్దతుదారులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన అన్నారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన సందీప్ వారియర్‌ను సీపీఎం కంచుకోట త్రికరిపూర్ నుంచి బరిలోకి దించారు. 
Go Back to Shorts
Kerala Assembly Elections
Congress
K Sudhakaran
AK Antony
CPM
Kerala Politics
Indian National Congress
nomination
Elections
LDF

More Telugu News