మంత్రి నారా లోకేశ్ను కలిసిన బండ్ల గణేశ్
- మంత్రి నారా లోకేశ్తో సినీ నిర్మాత బండ్ల గణేశ్ భేటీ
- తన సంకల్ప పాదయాత్ర విశేషాలను వివరించిన గణేశ్
- షాద్నగర్ నుంచి తిరుమల వరకు 23 రోజుల పాటు యాత్ర
- అసెంబ్లీలో సీఎం చంద్రబాబును కూడా కలిసిన బండ్ల గణేశ్
షాద్నగర్ నుంచి తిరుమల వరకు 535 కిలోమీటర్ల పాటు 23 రోజుల పాటు సాగిన తన పాదయాత్ర అనుభవాలను, దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని లోకేశ్తో పంచుకున్నారు. అనంతరం, శ్రీవారి దర్శనం తర్వాత స్వీకరించిన తీర్థ ప్రసాదాన్ని లోకేశ్కు అందజేశారు. ఇరువురు నేతలు పలు అంశాలపై హృద్యంగా మాట్లాడుకున్నట్టు తెలిసింది.
అంతకుముందు బండ్ల గణేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిశారు. ఏపీ అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ఈ సమావేశం జరిగింది. చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని తాను మొక్కుకున్న మొక్కును తీర్చుకోవడానికే ఈ పాదయాత్ర చేపట్టానని బండ్ల గణేశ్ తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఆయన్ను ఆత్మీయంగా పలకరించి, పాదయాత్ర విశేషాలను అడిగి తెలుసుకున్నారు. బండ్ల గణేశ్ అందించిన తిరుమల ప్రసాదాన్ని స్వీకరించారు.