Rashi Khanna: 'ఉస్తాద్ భగత్ సింగ్' కౌంట్డౌన్ స్టార్ట్.. డబ్బింగ్ మొదలుపెట్టిన రాశీ ఖన్నా
- 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి లేటెస్ట్ అప్డేట్
- డబ్బింగ్ పనులు షురూ
- పవన్ తో తొలిసారి స్క్రీన్ పంచుకుంటున్న రాశీ
- సినిమాలో 'శ్లోక' అనే కీలక పాత్రలో కనిపించనున్న నటి
- మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న రాశీ ఖన్నా తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
డబ్బింగ్ స్టూడియోలో స్క్రిప్ట్ చేతిలో పట్టుకుని నవ్వుతూ ఉన్న ఫోటోను రాశీ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. "డబ్బింగ్ మొదలైతే, కౌంట్డౌన్ నిజంగా మొదలైనట్టే అనిపిస్తుంది. దాదాపు పూర్తి కావొచ్చింది" అని క్యాప్షన్ జోడించారు. మార్చి 26న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, ఈ అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో రాశీ 'శ్లోక' అనే కీలక పాత్రలో కనిపించనుంది.
పవన్ కల్యాణ్తో రాశీ ఖన్నా నటిస్తున్న తొలి సినిమా ఇదే. గతంలో పవన్తో కలిసి సెల్ఫీ దిగిన ఫోటోను షేర్ చేస్తూ, ఆయనతో నటించడం తనకు దక్కిన గౌరవమని, ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకమని రాశీ పేర్కొన్నారు. దర్శకుడు హరీశ్ శంకర్తో ఆమెకు ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి కాంబినేషన్లో హైపర్, బెంగాల్ టైగర్ చిత్రాలు వచ్చాయి.
మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల మరో కథానాయికగా నటిస్తుండగా... పార్తీబన్, కేఎస్ రవికుమార్, నవాబ్ షా, గౌతమి వంటి ప్రముఖ నటులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
డబ్బింగ్ స్టూడియోలో స్క్రిప్ట్ చేతిలో పట్టుకుని నవ్వుతూ ఉన్న ఫోటోను రాశీ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. "డబ్బింగ్ మొదలైతే, కౌంట్డౌన్ నిజంగా మొదలైనట్టే అనిపిస్తుంది. దాదాపు పూర్తి కావొచ్చింది" అని క్యాప్షన్ జోడించారు. మార్చి 26న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, ఈ అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో రాశీ 'శ్లోక' అనే కీలక పాత్రలో కనిపించనుంది.
పవన్ కల్యాణ్తో రాశీ ఖన్నా నటిస్తున్న తొలి సినిమా ఇదే. గతంలో పవన్తో కలిసి సెల్ఫీ దిగిన ఫోటోను షేర్ చేస్తూ, ఆయనతో నటించడం తనకు దక్కిన గౌరవమని, ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకమని రాశీ పేర్కొన్నారు. దర్శకుడు హరీశ్ శంకర్తో ఆమెకు ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి కాంబినేషన్లో హైపర్, బెంగాల్ టైగర్ చిత్రాలు వచ్చాయి.
మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల మరో కథానాయికగా నటిస్తుండగా... పార్తీబన్, కేఎస్ రవికుమార్, నవాబ్ షా, గౌతమి వంటి ప్రముఖ నటులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.