అమెరికాలో తెలుగు యువతి హత్య... తమిళనాడులో నిందితుడి అరెస్ట్

Maryland Murder Case Arjun Sharma Arrested in India
షార్ట్స్‌లో చూడండి
అమెరికాలో హత్యకు గురైన తెలుగు యువతి నిఖిత గొడిశాల కేసులో అనుమానితుడిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఇంటర్ పోల్ నోటీసు నేపథ్యంలో నిఖిత మాజీ ప్రియుడు అర్జున్ శర్మను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిఖితను హత్య చేసి మృతదేహాన్ని తన అపార్ట్ మెంట్ లో దాచి అర్జున్ భారత్ కు పారిపోయివచ్చాడు. నిఖిత మృతదేహం బయటపడడంతో మేరీల్యాండ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిఖిత మాజీ ప్రియుడు అర్జున్ శర్మ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, నిఖిత హత్య తర్వాత అర్జున్ శర్మ దేశం విడిచి భారత్ కు పారిపోయినట్లు గుర్తించి ఇంటర్ పోల్ నోటీసులు జారీ చేశారు.

ఏం జరిగిందంటే..
మేరీల్యాండ్ లోని ఓ అపార్ట్ మెంట్ లో తెలుగు యువతి నిఖిత గొడిశాల హత్యకు గురైంది. ఆమె మాజీ ప్రియుడి అపార్ట్ మెంట్లో విగతజీవిగా కనిపించింది. నిఖిత హత్య కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ కోసం గాలించగా భారత్ కు పారిపోయినట్లు బయటపడింది. దీంతో నిఖితను అతడే హత్య చేశాడని భావించిన పోలీసులు.. ఇంటర్ పోల్ నోటీసులు జారీ చేశారు. భారత్‌కు పరారైన అర్జున్‌ను గుర్తించేందుకు పోలీసులు ఫెడరల్‌ అధికారుల సాయం కోరారు.
Go Back to Shorts
Nikhita Godishala
Nikhita Godishala murder
Arjun Sharma
Maryland
Telugu student
US crime
Interpol notice
Tamil Nadu police
Murder investigation
Ex-boyfriend

More Telugu News