జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం: జనసేన
- గ్రేటర్ ఎన్నికలపై జనసేన ఫోకస్
- పోటీకి సిద్ధమన్న గ్రేటర్ హైదరాబాద్ జనసేన అధ్యక్షుడు రాజలింగం
- కూకట్పల్లిలో పార్టీ నేతలతో కీలక సమావేశం
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన రాష్ట్ర ఇన్చార్జి నేమూరి శంకర్గౌడ్ మాట్లాడుతూ, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై నాయకులు దృష్టి సారించాలన్నారు. కార్యకర్తల సమీకరణ ద్వారా పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జనసేన నియోజకవర్గ ఇన్చార్జి ప్రేమ్కుమార్, వీర మహిళ చైర్మన్ కావ్య, ప్రధాన కార్యదర్శి దామోదర్రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.