KTR: కేటీఆర్పై ఎఫ్ఐఆర్.. ఆ సెక్షన్లు కేసుకు సరిపోలడం లేదన్న హైకోర్టు
- తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో కేటీఆర్ పిటిషన్
- రాజకీయ కక్షల కారణంగానే కేసు నమోదు చేశారని కోర్టుకు తెలిపిన కేటీఆర్
- ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకే కేసు నమోదు చేసినట్లు తెలిపిన పోలీసులు
హైదరాబాద్ నగరంలోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు నేడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన సెక్షన్లు ఈ కేసుకు సరిపోవడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
రాజకీయ కక్షల కారణంగానే ఈ కేసు నమోదు చేశారని కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకే కేసు నమోదు చేసినట్లు పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అమరవీరుల స్మారకం వద్ద గోరటి వెంకన్నను కేటీఆర్ ఇంటర్వ్యూ చేశారని, అందులో బీఆర్ఎస్కు లబ్ధి చేకూరేలా అంశాలు ఉన్నాయని వాదనలు వినిపించారు. అంతేకాకుండా, అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారని తెలిపారు.
ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు, ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన సెక్షన్లు ప్రస్తుత కేసుకు సరిపోవడం లేదని వ్యాఖ్యానిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
రాజకీయ కక్షల కారణంగానే ఈ కేసు నమోదు చేశారని కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకే కేసు నమోదు చేసినట్లు పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అమరవీరుల స్మారకం వద్ద గోరటి వెంకన్నను కేటీఆర్ ఇంటర్వ్యూ చేశారని, అందులో బీఆర్ఎస్కు లబ్ధి చేకూరేలా అంశాలు ఉన్నాయని వాదనలు వినిపించారు. అంతేకాకుండా, అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారని తెలిపారు.
ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు, ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన సెక్షన్లు ప్రస్తుత కేసుకు సరిపోవడం లేదని వ్యాఖ్యానిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.