పాక్ నుంచి ట్రంప్ కుమారుడికి డబ్బు ముడుతోంది.. అమెరికా మాజీ రాయబారి

Ex US Envoy Alleges Trump Son Received Money From Pakistan
షార్ట్స్‌లో చూడండి
40 సంవత్సరాలుగా భారత్ తో అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని అగ్రరాజ్యానికి చెందిన మాజీ రాయబారి రహమ్‌ ఇమాన్యుయేల్‌ పేర్కొన్నారు. ఈ కీలకమైన భాగస్వామ్యాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అహంభావంతో, తన స్వార్థం కోసం చెడగొడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ కుమారుడికి పాకిస్థాన్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు ముడుతోందని ఆరోపిస్తూ.. ఈ డబ్బు కోసమే ట్రంప్ భారత్ పై కక్ష కట్టారని పేర్కొన్నారు. తన స్వార్థం కోసం అమెరికా ప్రయోజనాలను కూడా పక్కన పెడుతున్నారని విమర్శించారు.

చైనాను ఎదుర్కోవడంలో అమెరికాకు అత్యంత కీలకమైన, నమ్మకమైన భాగస్వామి భారతదేశమేనని ఇమాన్యుయేల్ చెప్పారు. ఆ విషయాన్ని గుర్తించకుండా అధ్యక్షుడు ట్రంప్‌ అహం చూపిస్తున్నారు. భారత్ పాక్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చింది తానేనని ట్రంప్ చేసుకుంటున్న ప్రచారాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ తోసిపుచ్చడమూ ఓ కారణమేనని చెప్పారు. కాగా, రహమ్‌ ఇమాన్యుయేల్‌ గతంలో జపాన్ కు అమెరికా రాయబారిగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమెరికా, భారత్ సంబంధాలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Donald Trump
Rahm Emanuel
India US relations
US ambassador
Pakistan
Narendra Modi
Trump son Pakistan money
India Pakistan ceasefire agreement
US foreign policy
China

More Telugu News