యూకేలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం

UK Road Accident Kills Two Telugu Students Including Rishitheja Rapolu
షార్ట్స్‌లో చూడండి
ఉన్నత చదువుల కోసం యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు అక్కడ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. సోమవారం తెల్లవారుజామున ఎసెక్స్ నగరంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఒకరిని హైదరాబాద్, బోడుప్పల్ ప్రాంతానికి చెందిన రిషితేజ రాపోలుగా (21), మరొకరిని నాదర్ గుల్ కి చెందిన తర్రె చైతన్యగా గుర్తించారు. ఈ వార్త  వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 

ఇల్‌ఫోర్డ్-బార్కింగ్ ప్రాంతంలో నివసిస్తున్న తొమ్మిది మంది స్నేహితులు, రూమ్‌మేట్స్ కలిసి సరదాగా సౌత్‌ఎండ్-ఆన్-సీ అనే ప్రదేశానికి వెళ్లేందుకు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న వాహనాలు ఎసెక్స్ నగరంలోని ఏ130 డ్యూయల్ క్యారేజ్‌వే వద్ద రాక్‌లీ స్పర్ రౌండ్‌అబౌట్ సమీపంలో ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన అధికారులు, తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్‌లో రాయల్ లండన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వారు మృతి చెందినట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. ప్రమాద తీవ్రత కారణంగా, అధికారులు ఆ డ్యూయల్ క్యారేజ్‌వేను శాడ్లర్స్ ఫామ్ రౌండ్‌అబౌట్ నుంచి రెటెన్‌డన్ టర్న్‌పైక్ వరకు చాలా మైళ్ల దూరం మూసివేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఎసెక్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదకరంగా వాహనాలు నడిపి మరణానికి కారణమయ్యారనే ఆరోపణలపై రెండు వాహనాల డ్రైవర్లను అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. 23, 24 ఏళ్ల వయసున్న ఆ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Rishitheja Rapolu
UK accident
Essex accident
Telugu students
Road accident
International students
United Kingdom
student death
A130
Ilford Barking

More Telugu News