పులివెందులలో టీడీపీ గెలిచే పరిస్థితి ఉంటే ఈ దాడులు ఎందుకు?: లేళ్ల అప్పిరెడ్డి
- టీడీపీ గెలుపుకోసం పోలీసు, రెవెన్యూ యంత్రాంగం పనిచేస్తోందన్న లేళ్ల
- ఈ ఉప ఎన్నికతో రాష్ట్ర రాజకీయాలు తారుమారు అవుతాయా అని ప్రశ్న
- ఎన్నికలు వచ్చినప్పుడే సునీత బయటకు వస్తారని విమర్శ
పులివెందుల ఉప ఎన్నికతోనే రాష్ట్ర రాజకీయాలు తారుమారు అవుతాయా? అని లేళ్ల ప్రశ్నించారు. ఆరు పోలింగ్ కేంద్రాలను మార్చేశారని... ప్రజలు ఓటు వేయాలనుకుంటున్నారా? వద్దనుకుంటున్నారా? అని అడిగారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారనేది తెలుస్తుందని అన్నారు. ఉప ఎన్నికలో టీడీపీ గెలిచే పరిస్థితి ఉంటే ఈ దాడులు ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడే సునీత (వివేకా కుమార్తె) బయటకు వస్తారని అన్నారు.