Srisailam Project: ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

Srisailam Project receives heavy floodwater from upstream
  • సుంకేశుల, జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 1,02,580 క్యూసెక్కుల వరద నీరు 
  • ప్రస్తుతం శ్రీశైలం ఔట్ ఫ్లో 1,13,115 క్యూసెక్కులు
  • నీటిని దిగువకు విడుదల
కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో నీటి ప్రవాహం పెరిగింది. తద్వారా సుంకేశుల, జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి శ్రీశైలంకు 1,02,580 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం ఔట్ ఫ్లో 1,13,115 క్యూసెక్కులుగా నమోదైంది. 

ఒక గేటు ద్వారా 26,698 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ కు విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడి గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,102 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 

శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుతం 882 అడుగుల నీటిమట్టం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 198.81 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. 
Srisailam Project
Srisailam reservoir
Krishna River
Jurala Project
Sunkesula Project
Nagarjuna Sagar
Telangana
Andhra Pradesh
Flood alert

More Telugu News