గోదావరిలో గల్లంతైన 8 మందిలో ఒకరి మృత దేహం లభ్యం

Godavari River Accident One Body Recovered Search Continues
షార్ట్స్‌లో చూడండి
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మడివరం మండలం, కమినిలంక సమీపంలోని గోదావరిలో నిన్న 8 మంది యువకులు గల్లంతైన విషయం విదితమే. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, గల్లంతైన 8 మందిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మిగిలిన ఏడుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

సోమవారం గోదావరిలో స్నానానికి దిగిన ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. ఒకరిని రక్షించబోయి మరొకరు నదిలో కొట్టుకుపోయారు. కె. గంగవరం మండలం, శేరులంకకు చెందిన పొలిశెట్టి అభిషేక్ తన ఇంట్లో జరిగిన వేడుకకు స్నేహితులను ఆహ్వానించాడు. కాకినాడ, రామచంద్రాపురం, మండపేట ప్రాంతాలకు చెందిన యువకులు ఈ వేడుకకు హాజరయ్యారు.

వీరిలో కొందరు మధ్యాహ్నం భోజనాల తర్వాత ఈత సరదా తీర్చుకునేందుకు గౌతమి గోదావరి తీరానికి వెళ్లారు. 11 మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగగా, 8 మంది గల్లంతయ్యారు. ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. 
Go Back to Shorts
Godavari River Accident
Konaseema District
Mummadivaram
Drowning Incident
NDRF Rescue
River Search Operation
Youth Drowning
Andhra Pradesh News

More Telugu News