Pakistan: కాల్పుల విరమణ... అయినా పాక్ ను నమ్మొద్దంటున్న నేతలు

India and Pakistan Ceasefire Leaders Cautious Despite Agreement

  • భారత్, పాకిస్థాన్ మధ్య అన్ని సైనిక క్షేత్రాల్లో కాల్పుల విరమణ
  • ఇరు దేశాల డీజీఎంఓల సంప్రదింపుల అనంతరం ఒప్పందం
  • సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనలు
  • మే 12న తదుపరి విడత సైనిక అధికారుల చర్చలు
  • ఉగ్రవాదంపై రాజీలేని వైఖరి కొనసాగుతుందన్న భారత్

భారత్, పాకిస్థాన్ మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు చల్లారాయి. ఇరు దేశాల సైనిక దళాల మధ్య భూమి, గాలి, సముద్ర మార్గాలన్నింటిలోనూ కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) స్థాయి అధికారుల మధ్య జరిగిన సంభాషణ అనంతరం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఒప్పందం సాయంత్రం 5 గంటల నుంచి తక్షణమే అమల్లోకి వచ్చింది. అయితే, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా సరే... పాకిస్థాన్ ను మాత్రం నమ్మొద్దని పలువరు భారత రాజకీయనేతలు అభిప్రాయపడ్డారు. పాక్ ను ఓ కంట కనిపెడుతుండాలని సూచించారు.

సిద్ధరామయ్య (కర్ణాటక ముఖ్యమంత్రి): కాల్పుల విరమణను స్వాగతిస్తూనే, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. "భారత్, పాకిస్థాన్ రెండూ అంగీకరిస్తే మంచిదే. అయితే, మనం అప్రమత్తంగా ఉండాలి... కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై దృష్టి సారించాలి" అని అన్నారు.

భగవంత్ మాన్ (పంజాబ్ ముఖ్యమంత్రి): కాల్పుల విరమణను స్వాగతిస్తూ, నిఘా అవసరాన్ని నొక్కిచెప్పారు. "కాల్పుల విరమణ ప్రకటించడం శుభవార్త, కానీ పంజాబ్ అప్రమత్తంగా ఉంటుంది. మా అంతర్జాతీయ సరిహద్దులో యాంటీ-డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తాం" అని చండీగఢ్‌లో విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

శశి థరూర్ (కాంగ్రెస్ ఎంపీ): కాల్పుల విరమణ అత్యవసరమైనదని, ఆలస్యంగా జరిగిందని అభివర్ణించారు. "శాంతి అత్యవసరం... నాకు చాలా సంతోషంగా ఉంది. భారత్ ఎప్పుడూ దీర్ఘకాలిక యుద్ధాన్ని కోరుకోలేదు. ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పడానికే భారత్ యుద్ధం చేసింది, ఆ గుణపాఠం చెప్పబడింది" అని అన్నారు.

కపిల్ సిబల్ (రాజ్యసభ ఎంపీ): కాల్పుల విరమణను స్వాగతిస్తూ, ఇది పాకిస్థాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాల నిర్మూలనకు దారితీయాలని నొక్కిచెప్పారు. "కాల్పుల విరమణను నేను స్వాగతిస్తున్నాను, ఇరుపక్షాలను అభినందిస్తున్నాను. ఇప్పుడు యుద్ధంతో సంబంధం లేని అమాయకుల ప్రాణనష్టం చూడము... వారు (పాకిస్థాన్) దీనిని ఆపి, ఈ ఉగ్రవాద శిబిరాలను తొలగించి, అవి ఈ దేశంలో ఉగ్రవాదానికి కేంద్రాలుగా మారకుండా చూడాలి. అది కొనసాగినంత కాలం, ఈ సంఘర్షణ కొనసాగుతుంది, తాత్కాలిక కాల్పుల విరమణ ఎప్పటికీ శాశ్వతం కాదు" అని ఆయన అభిప్రాయపడ్డారు.

Pakistan
India-Pakistan ceasefire
Siddharamaiah
Bhagwant Mann
Shashi Tharoor
Kapil Sibal
Indo-Pak tensions
ceasefire agreement
terrorism
cross-border firing
  • Loading...

More Telugu News