లవ్ జిహాద్ కు పాల్పడేవాళ్లను గుండెల్లోకి గురిపెట్టి కాల్చాలి: మధ్యప్రదేశ్ మంత్రి వ్యాఖ్యలు
- లవ్ జిహాద్' చేస్తే బహిరంగంగా కాల్చివేయాలన్న మంత్రి విశ్వాస్ సారంగ్
- లవ్ జిహాద్' నిందితులకు జీవించే హక్కు లేదని వ్యాఖ్యలు
- వారు భూమికి భారమని వెల్లడి
అంతకుముందు రోజు, అత్యాచారం, బ్లాక్మెయిల్ కేసులో నిందితుడైన ఫర్హాన్ ఖాన్ అనే వ్యక్తి పోలీసు కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారి నుంచి తుపాకీ లాక్కునే ప్రయత్నం చేయగా జరిగిన పెనుగులాటలో అతడి కాలికి బుల్లెట్ గాయమైంది. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ ఘటనపై స్పందిస్తూ మంత్రి సారంగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "వాళ్లు అతడిని కాలిలో ఎందుకు కాల్చారు? గుండెల్లో గురిపెట్టి కాల్చాల్సింది. అలాంటి వాళ్లకు జీవించే హక్కు లేదు" అని ఆయన అన్నారు. "లవ్ జిహాద్ వంటి నీచమైన పనులకు పాల్పడేవారికి, మైనర్ బాలికలపై అత్యాచారాలు చేసేవారికి ఈ దేశంలో లేదా రాష్ట్రంలో జీవించే హక్కు లేదు. వాళ్లు ఈ భూమికి భారం. ఇలాంటి దుండగులను క్షమించబోమని స్పష్టమైన సందేశం ఇవ్వాలి. వారిని బహిరంగంగా కాల్చి హతమార్చాలి" అని సారంగ్ వ్యాఖ్యానించారు.