మంత్రి నారాయణ కుమార్తె డాక్టర్ శరణి పుస్తకావిష్కరణకు హాజరైన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Attends Dr Sharanis Book Launch
  • మైండ్ సెట్ షిఫ్ట్ అనే పుస్తకాన్ని రచించిన డాక్టర్ శరణి
  • విజయవాడలో పుస్తకావిష్కరణ
  • పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి కాపీ చిరంజీవికి అందించిన చంద్రబాబు
ఏపీ మంత్రి నారాయణ కుమార్తె, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోడలు డాక్టర్ శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు... తొలి కాపీని చిరంజీవికి అందించారు. అనంతరం, రచయిత డాక్టర్ శరణికి, మంత్రి నారాయణకు, గంటా శ్రీనివాసరావుకు కూడా కాపీలు అందించారు. అంతకుముందు, వేదికపై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమం విజయవాడ లబ్బీపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో జరిగింది. 


Advertisement
Chandrababu Naidu
Dr. Sharani
Mindset Shift
Book Launch
Chiranjeevi
Nara Lokesh
Ganta Srinivasa Rao
Andhra Pradesh Politics
Political Career
Vijayawada

More Telugu News