Mukesh Kumar: లక్నో జట్టును దెబ్బతీసిన ముఖేశ్ కుమార్

- ఐపీఎల్ లో నేడు లక్నో సూపర్ జెయింట్స్ × ఢిల్లీ క్యాపిటల్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసిన లక్నో
- 4 వికెట్లతో రాణించిన ముఖేశ్ కుమార్
ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ ముఖేశ్ కుమార్ విజృంభణతో లక్నో సూపర్ జెయింట్స్ డీలాపడింది. లక్నోలోని వాజ్ పేయి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో, మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ ముఖేశ్ కుమార్ 4 వికెట్లు తీసి లక్నో జట్టును దెబ్బకొట్టాడు. ముఖేశ్ కుమార్ ధాటికి లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ (0) డకౌట్ అయ్యాడు. ఎల్ఎస్ జీ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్ తొలి వికెట్ కు 87 పరుగులతో శుభారంభం అందించినా, ముఖేశ్ కుమార్ చకచకా వికెట్లు తీయడంతో లక్నో జట్టుకు ఆశించిన భారీ స్కోరు సాధ్యం కాలేదు. మార్క్రమ్ 52, మార్ష్ 45 పరుగులు చేశారు. చివర్లో ఆయుష్ బదోనీ 36 పరుగులు చేశాడు. ని
కోలాస్ పూర్ (9) మరోసారి విఫలం కాగా, అబ్దుల్ సమద్ (2) కూడా ఎలాంటి మెరుపులు లేకుండానే వెనుదిరిగాడు. డేవిడ్ మిల్లర్ 14 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మిచెల్ స్టార్క్, దుష్మంత చమీర చెరో వికెట్ తీశారు.