Venkaiah Naidu: ఇందిరా గాంధీ వల్లే ఈ పరిస్థితి: జమిలి ఎన్నికలపై వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

Simultaneous Polls Venkaiah Naidu Blames Indira Gandhi

  • ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం వైపు ఎన్డీయే సర్కారు మొగ్గు
  • తాజాగా ఇదే అంశంపై సదస్సుకు హాజరైన వెంకయ్యనాయుడు
  • ఇందిరాగాంధీ తనకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేశారని వెల్లడి
  • దాంతో అసెంబ్లీ ఎన్నికల సమయాలు మారిపోయాయని వివరణ
  • అంతకుముందు 1967 వరకు జమిలి ఎన్నికలు జరిగాయన్న వెంకయ్య

ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై ఎన్డీయే సర్కారు ఆసక్తి చూపిస్తోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు  ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్నది ఈ విధానం ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే దీనిపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిషన్ కూడా ఏర్పాటైంది. కోవింద్ కమిషన్ నివేదికను కూడా సమర్పించింది. 

తాజాగా ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రాముఖ్యత-సవాళ్లు-ప్రభావం పేరిట కర్ణాటక చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బెంగళూరులో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. 1952లో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయని, అనంతరం 1967 వరకు దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగాయని వివరించారు. 

ఆ తర్వాత ఇందిరాగాంధీ వచ్చాక పరిస్థితి మారిపోయిందని అన్నారు. తనకు నచ్చని రాష్ట్రాల ప్రభుత్వాలను ఇందిరాగాంధీ రద్దు చేయడంతో... అసెంబ్లీ ఎన్నికల సమయాలు మారిపోయాయని వెంకయ్యనాయుడు తెలిపారు. గతంలో జమిలి ఎన్నికలు నిర్వహించింది కాంగ్రెస్ హయాంలోనే అని, మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడెందుకు జమిలి ఎన్నికలు వద్దంటుందో చెప్పాలని నిలదీశారు.

Venkaiah Naidu
One Nation One Election
Simultaneous Elections
Indira Gandhi
Ram Nath Kovind
Election Commission
Congress Party
NDA Government
Indian Politics
Assembly Elections
  • Loading...

More Telugu News