తగ్గేదే లేదంటున్న పృథ్వీ... రోజుకు 11 సార్లు నీళ్లు తాగాలంటూ ట్వీట్
- ఎక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన కమెడియన్ పృథ్వీ
- సినీ వేదికల పైనుంచి కామెంట్స్ చేస్తే జనాలు ఫీలవుతున్నారని వెల్లడి
- అందుకే ఎక్స్ లోకి వచ్చానని వివరణ
- వేడి 151 డిగ్రీలకు చేరే అవకాశం ఉందంటూ తాజా ట్వీట్
ఇటీవల ఓ సినిమా వేడుకలోనూ వేదికపై నుంచి ఇలాంటి వ్యాఖ్యలే చేసిన నటుడు పృథ్వీపై తీవ్ర విమర్శలు రావడం తెలిసిందే. వేదికల పైనుంచి చేస్తే విమర్శలు వస్తున్నాయని, జనాలు ఫీల్ అవుతున్నారని, అందుకే ఎక్స్ లోకి ఎంటర్ అవుతున్నానని పృథ్వీ తన తొలి ట్వీట్ లో వివరించారు.