శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ పకడ్బందీ ఏర్పాట్లు.. వివరాలు ఇవిగో!
- ఈసారి రెండు పర్యాయాలు శ్రీవారి బ్రహ్మోత్సవాలు
- ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన టీటీడీ జేఈవో శరత్
- భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు
- ప్రధాన కూడళ్లలో స్వాగత తోరణాలు, విద్యుత్ దీపాల అలంకరణకు ఆదేశం
- అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని సూచన
తిరుమల శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఉత్సవాల సమయంలో తిరుమల, తిరుపతికి భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని టీటీడీ సంయుక్త కార్యనిర్వహణాధికారి (జేఈవో) డాక్టర్ ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు అత్యుత్తమ సేవలు అందించాలని ఆయన స్పష్టం చేశారు.
శుక్రవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో జేఈవో డాక్టర్ శరత్.. ఇంజినీరింగ్, ఆరోగ్యం, విజిలెన్స్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు పెరటాసి శనివారాల్లోనూ భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని, ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు.
భక్తుల వాహనాల రద్దీని నియంత్రించడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తిరుపతి నగరం, శివారు ప్రాంతాల్లో అవసరమైన పార్కింగ్ స్థలాలను ముందుగానే గుర్తించి సిద్ధం చేయాలని సూచించారు. ట్రాఫిక్ను సమర్థవంతంగా నియంత్రించేందుకు వివిధ ప్రాంతాల్లో హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ పార్కింగ్, హోల్డింగ్ పాయింట్ల వద్ద పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని, తగిన సంఖ్యలో మొబైల్ మరుగుదొడ్లు, స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యాలు కల్పించి నిరంతరం పర్యవేక్షించాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
బ్రహ్మోత్సవాల శోభ ఉట్టిపడేలా తిరుపతి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని జేఈవో సూచించారు. ప్రధాన కూడళ్లు, రహదారులు, భక్తులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక ఆలయాలు, ప్రధాన టీటీడీ భవనాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించి ఆధ్యాత్మిక వాతావరణం సృష్టించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. భక్తులకు సమాచారం సులభంగా అందించేందుకు కీలక ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్లతో కూడిన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు.
భక్తులకు సహాయ సహకారాలు అందించేందుకు టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, అలిపిరి నడక మార్గం, విష్ణునివాసం, శ్రీనివాసం వంటి ప్రాంతాల్లో అదనపు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని జేఈవో పేర్కొన్నారు. అవసరమైన చోట్ల శ్రీవారి సేవకులను నియమించి వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని పీఆర్వో డాక్టర్ టి. రవికి సూచించారు. మహతి కళాక్షేత్రం, రామచంద్ర పుష్కరిణిలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు.
ఈ సమావేశంలో ఎస్ఈ-1 శ్రీ మనోహరం, ఎస్ఈ (ఎలక్ట్రికల్) వెంకటేశ్వర్లు, డీఈలు రవిశంకర్ రెడ్డి, సరస్వతి, విజిలెన్స్ అధికారి గిరిధర్, అదనపు ఆరోగ్య అధికారి డాక్టర్ సునీల్ తదితర అధికారులు పాల్గొన్నారు.
శుక్రవారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో జేఈవో డాక్టర్ శరత్.. ఇంజినీరింగ్, ఆరోగ్యం, విజిలెన్స్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు పెరటాసి శనివారాల్లోనూ భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని, ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు.
భక్తుల వాహనాల రద్దీని నియంత్రించడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తిరుపతి నగరం, శివారు ప్రాంతాల్లో అవసరమైన పార్కింగ్ స్థలాలను ముందుగానే గుర్తించి సిద్ధం చేయాలని సూచించారు. ట్రాఫిక్ను సమర్థవంతంగా నియంత్రించేందుకు వివిధ ప్రాంతాల్లో హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ పార్కింగ్, హోల్డింగ్ పాయింట్ల వద్ద పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని, తగిన సంఖ్యలో మొబైల్ మరుగుదొడ్లు, స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యాలు కల్పించి నిరంతరం పర్యవేక్షించాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
బ్రహ్మోత్సవాల శోభ ఉట్టిపడేలా తిరుపతి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని జేఈవో సూచించారు. ప్రధాన కూడళ్లు, రహదారులు, భక్తులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక ఆలయాలు, ప్రధాన టీటీడీ భవనాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించి ఆధ్యాత్మిక వాతావరణం సృష్టించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. భక్తులకు సమాచారం సులభంగా అందించేందుకు కీలక ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్లతో కూడిన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు.
భక్తులకు సహాయ సహకారాలు అందించేందుకు టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, అలిపిరి నడక మార్గం, విష్ణునివాసం, శ్రీనివాసం వంటి ప్రాంతాల్లో అదనపు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని జేఈవో పేర్కొన్నారు. అవసరమైన చోట్ల శ్రీవారి సేవకులను నియమించి వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని పీఆర్వో డాక్టర్ టి. రవికి సూచించారు. మహతి కళాక్షేత్రం, రామచంద్ర పుష్కరిణిలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు.
ఈ సమావేశంలో ఎస్ఈ-1 శ్రీ మనోహరం, ఎస్ఈ (ఎలక్ట్రికల్) వెంకటేశ్వర్లు, డీఈలు రవిశంకర్ రెడ్డి, సరస్వతి, విజిలెన్స్ అధికారి గిరిధర్, అదనపు ఆరోగ్య అధికారి డాక్టర్ సునీల్ తదితర అధికారులు పాల్గొన్నారు.