గంట ముందే అసెంబ్లీకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రేవంత్ భేటీ
- భూ భారతి, రైతు భరోసా అంశాలపై మార్గనిర్దేశం చేసిన సీఎం
- ఈరోజు మూడు బిల్లులను ప్రవేశపెడుతున్న ప్రభుత్వం
ఈరోజు మరో మూడు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. తెంగాణాణ మున్సిపాలిటీస్ చట్ట సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును రేవంత్ సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును మంత్రి సీతక్క సభలో ప్రవేశపెడతారు. ఈ రెండు అంశాలపై సభలో లఘు చర్చ జరుగుతుంది.
గంట ముందే అసెంబ్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి భూ భారతి, రైతు భరోసా తదితర అంశాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో చర్చలు జరపనున్నారు. తమ పార్టీ సభ్యులకు మార్గనిర్దేశం చేయనున్నారు.