పుణే టెస్టు... కష్టాల్లో భారత్
- పుణే వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు
- శాంట్నర్ విజృంభణతో పీకలోతు కష్టాల్లో టీమిండియా
- 167 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఎదురీత
- చేతిలో నాలుగు వికెట్లే భారత్ ముందు కొండంత లక్ష్యం
యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అర్ధ శతకం (77) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. గిల్ (23) తో కలిసి జైస్వాల్ రెండో వికెట్కు 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. టీ విరామానికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. ఇంకా విజయానికి 181 పరుగులు కావాలి. టీమిండియా చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం క్రీజులో జడేజా (4), అశ్విన్ (9) ఉన్నారు.