ఒకే వేదిక పంచుకోనున్న రేవంత్ రెడ్డి, కేటీఆర్.. ఎక్కడంటే..!
--
వివిధ కార్యక్రమాలలో సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా నిలదీస్తూ, పదునైన విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అంతే దీటుగా ప్రతి విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, కేటీఆర్ ల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. తెలంగాణ తల్లి, రాజీవ్ గాంధీ విగ్రహాల ఏర్పాటుపై ట్వీట్లు, కౌంటర్ ట్వీట్లతో విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరి భేటీపై రాజకీయ వర్గాలతో పాటు సామాన్యులలోనూ ఆసక్తి నెలకొంది. కాగా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నెల 21న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం పార్టీ ఏచూరి సంస్మరణ సభ నిర్వహించనుంది. ఈ సభకు హాజరుకావాలంటూ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అటు కేటీఆర్ ను సీపీఎం నాయకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి వారిరువురూ హాజరవుతున్నట్లు సమాచారం.