పదవి అవసరం లేదు... రేవంత్ వెంట ఉంటా: మోత్కుపల్లి నర్సింహులు
- ఎస్సీ వర్గీకరణ చేస్తామని రేవంత్ ప్రకటించడంపై మోత్కుపల్లి హర్షం
- సీఎం ప్రకటన మాదిగ జాతికి ధైర్యాన్ని ఇచ్చిందని వ్యాఖ్య
- 80 లక్షల మంది మాదిగలతో సభ పెడతానన్న మోత్కుపల్లి
రేవంత్ రెడ్డి ప్రకటన మాదిగ జాతి మొత్తానికి ధైర్యాన్ని ఇచ్చిందని మోత్కుపల్లి అన్నారు. జాతి మొత్తం రేవంత్ వెంట ఉందని... ఆయనకు తాము అన్ని విధాలుగా రుణపడి ఉంటామన్నారు. రేవంత్ శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండొచ్చని చెప్పారు. దేశానికే ఆదర్శవంతమైన సీఎంగా రేవంత్ నిలుస్తారని అన్నారు. మంద కృష్ణ మాదిగను కూడా రేవంత్ కు అండగా తీసుకొస్తామని చెప్పారు. తనకు ఎలాంటి పదవి అవసరం లేదని... ఒక కార్యకర్తగా ముఖ్యమంత్రి వెనుక ఉంటూ పని చేస్తానని తెలిపారు.
రిజర్వేషన్లపై రేవంత్ ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావాలని మోత్కుపల్లి కోరారు. 80 లక్షల మంది మాదిగలను హైదరాబాద్ కు తీసుకొచ్చి సభ పెడతామని చెప్పారు. మాదిగ జాతికి సీఎం రేవంత్ పెద్ద మాదిగ అన్నారు.