పులివెందుల కాంట్రాక్టర్లకు మాజీ సీఎం జగన్ భరోసా!
- పాడా కింద అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు అధైర్యపడొద్దన్న మాజీ సీఎం
- కోర్టుకు వెళ్లైనా బిల్లులు తెచ్చుకుందామని హామీ
- వైసీపీ హయాంలో బిల్లులు సకాలంలో చెల్లించామని గుర్తు చేసిన జగన్
- కాంట్రాక్టర్లు కాస్త ఓపిక పట్టాలని సూచన
మరోవైపు, ఆదివారం జగన్ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానుల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీ చార్జి చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో కార్యాలయ అద్దాలు పగిలి ఓ కార్యకర్తకు గాయాలయ్యాయి. క్యాంపు కార్యాలయానికి పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పులివెందుల, కడప డీఎస్పీలు వినోద్కుమార్, రవికుమార్, రమాకాంత్ ఆధ్వర్యంలో తొమ్మిది మంది సీఐలు, ఏడుగురు ఎస్సైలు, 130 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.