30 వేలకు పైగా దొంగ ఓట్లు నమోదు చేశారు: ఎన్నికల సంఘానికి తుమ్మల నాగేశ్వరరావు ఫిర్యాదు
- దొంగ ఓట్ల నమోదుపై కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు తుమ్మల
- ఇంటి నెంబర్ లేకుండానే ముప్పై వేల ఓట్లు నమోదు చేశారని ఆరోపణ
- దొంగ ఓట్ల వివరాలతో కూడిన లేఖను ఈసీకి అందించిన మాజీ మంత్రి
జిల్లాలో ఇంటి నెంబర్లు లేకుండానే ఓట్లు నమోదు చేశారన్నారు. ఓట్ల జాబితా తుది ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో దొంగ ఓట్లపై దృష్టి సారించాలన్నారు. ఇంటి నెంబర్ లేకుండా నమోదైన ఓట్లను వెంటనే తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. జాబితా నుంచి దొంగ ఓట్లను తొలగించిన తర్వాత తుది జాబితాను విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఖమ్మంలో నియోజకవర్గాల వారీగా నమోదు చేసిన దొంగ ఓట్ల వివరాలతో కూడిన లేఖను తుమ్మల ఈసీకి అందించారు.