మేడిగడ్డకు బయలుదేరిన రాహుల్ గాంధీ..
- కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను పరిశీలించనున్న అగ్రనేత
- రాహుల్ వెంట వెళ్తున్న రేవంత్ రెడ్డి
- హెలికాఫ్టర్ ల్యాండింగ్కు అనుమతివ్వడంతో ఉదయమే పయనం
ఇదిలావుండగా కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులతో లక్షల ఎకరాలకు నీరు అందుతుంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లతో కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయని రాహుల్గాంధీ బుధవారం విమర్శించారు. కల్వకుర్తిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కో బ్యారేజీ కూలిపోతోందని, సీఎం కేసీఆర్ వెళ్లి పరిశీలించి అక్కడే సమీక్ష జరపాలని సూచన చేశారు. ఇక నాగార్జునసాగర్, ప్రియదర్శిని జూరాల, శ్రీరాంసాగర్, సింగూరు ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించాయని, ఏ సమస్యా లేకుండా అవి నేటికీ పటిష్ఠంగా ఉన్నాయని సమర్థించుకున్నారు.