బీఎస్పీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ప్రతి మండలానికి ఓ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్న బీఎస్పీ
- ప్రతి ఏడాది మండలానికి 100 మందికి విదేశీ విద్యను అందిస్తామని హామీ
- ప్రతి పంటకు మద్దతు ధర కల్పిస్తామన్న బీఎస్పీ
ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని, ప్రతి ఏడాది మండలానికి 100 మంది విద్యార్థులకు విదేశీ విద్యను అందిస్తామని తమ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ప్రతి పంటకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. ప్రతి సంవత్సరం రూ.25వేల కోట్లతో పౌష్టికాహార, ఆరోగ్య బడ్జెట్ ప్రవేశ పెడతామన్నారు. భీమ్ రక్షా కేంద్రాల కింద వృద్ధులకు వసతి, ఆహారం, వైద్యం అందిస్తామన్నారు.