తొలి మ్యాచ్ కు ముందు సన్ రైజర్స్ కు షాక్
- ఆదివారం రాజస్థాన్ తో జరిగే మ్యాచ్ కు కెప్టెన్ మార్ క్రమ్ దూరం
- నెదర్లాండ్స్ తో దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ లో పాల్గొంటున్న మార్ క్రమ్, క్లాసెన్, మాస్కో జాన్సెన్
- కెప్టెన్ గా వ్యవహరించనున్న భువనేశ్వర్ కుమార్
ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు నెదర్లాండ్స్ తో వన్డే సిరీస్ ఆడుతోంది. మార్క్ రమ్, జాన్సెన్, క్లాసెన్ ముగ్గురూ జాతీయ జట్టుతో బిజీగా ఉన్నారు. శుక్ర, ఆదివారాల్లో రెండు మ్యాచ్ లు ఆడనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సన్ రైజర్స్ తొలి మ్యాచ్ కు ఈ ముగ్గురూ అందుబాటులో ఉండడం లేదు. దీంతో టీమిండియా వెటరన్ సీమర్ భువనేశ్వర్ కుమార్ జట్టును నడిపించనున్నాడు.. ఏప్రిల్ 7న లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగే మ్యాచ్కు మార్ క్రమ్, జాన్సెన్, క్లాసెన్ బరిలోకి దిగనున్నారు.