K Kavitha: కాసేపట్లో కవిత ధర్నా ప్రారంభం.. దీక్షలో కూర్చోనున్న 500 మంది

Kavitha Deeksha to start by 10 AM
షార్ట్స్‌లో చూడండి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కవిత దీక్ష కొనసాగనుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ ఆమె దీక్ష చేయనున్నారు. కవిత దీక్షకు దేశ వ్యాప్తంగా 18 ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. 

ఈ పార్టీల ప్రతినిధులు కవిత దీక్షలో కూర్చోనున్నారు. అంతేకాదు దేశంలోని వివిధ మహిళా హక్కుల సంఘాలు కూడా కవిత దీక్షకు సంఘీభావం ప్రకటించాయి. ఉదయం 10 గంటలకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షను ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సీపీఐ కార్యదర్శి డి.రాజా దీక్షను ముగించనున్నారు.
Go Back to Shorts
K Kavitha
BRS
Deeksha
Delhi

More Telugu News