అబద్ధాన్ని నిజమని నమ్మించేందుకు బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ
- పెళ్లై మూడేళ్లయినా కలగని సంతానం
- అత్తంటి వారి సూటిపోటి మాటలను భరించలేక గర్భం దాల్చినట్టు అబద్ధం
- ప్రసవానికని పుట్టింటికి వెళ్లిన నిందితురాలు
- నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాలుడి అపహరణ
ఈ క్రమంలో కర్ణాటకలోని కలబురిగికి చెందిన బి.మంగమ్మ (30) తన ఏడాది వయసున్న కుమారుడితో నిన్న రైల్వే స్టేషన్లో నిందితురాలి కంటబడింది. వెంటనే ఆమె వద్దకు వెళ్లి మాటలు కలిపింది. ఆ తర్వాత కాసేపటికి టికెట్ కోసమని వెళ్తూ మంగమ్మ తన బిడ్డను సోనికి అప్పగించింది. అందుకోసమే ఎదురుచూస్తున్న ఆమె బిడ్డను తీసుకుని అక్కడి నుంచి క్షణాల్లో మాయమైంది. టికెట్ తీసుకుని వచ్చిన మంగమ్మ తన బిడ్డతోపాటు సోని కూడా కనిపించకపోవడంతో వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితురాలు బాబుతో ఆటోలో వెళ్లి కవాడిగూడలో దిగినట్టు గుర్తించారు. అక్కడికి చేరుకుని సోనిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని రక్షించి తల్లికి అప్పగించారు.